Coronavirus Alert: ప్రస్తుతం భారతదేశ ప్రజలు కరోనా పేరు చెబితేనే భయపడిపోతున్నారు. ఇతరులు దగ్గినా.. తుమ్మినా అదొక పెద్ద నేరంగా భావిస్తున్నారు. ఇక ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందో ఎవరికి అర్ధం కావట్లేదు. ఇదిలా ఉంటే ఈ మహమ్మారి గురించి భారతీయులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త గగన్దీప్ కాంగ్ చెబుతున్నారు.
కొవిడ్ 19 ప్రభావం ఇండియన్స్పై చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు. దాన్ని నిరూపిస్తూ సరైన ఉదాహరణను కూడా ఆమె వివరించారు. ఈ వైరస్ సోకిన ప్రతీ ఐదుగురిలో నలుగురికి ప్రత్యేక వైద్యం అవసరం లేదని.. సాధారణంగా జలుబు, జ్వరానికి వాడే పారాసిటమాల్ ట్యాబ్లెట్ సరిపోతుందన్నారు. ఇది కూడా పెద్దవారికి మాత్రమేనని గగన్దీప్ కాంగ్ స్పష్టం చేశారు. ఇక చిన్నారులకు కరోనా వైరస్తో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని తెలిపారు.
కాగా, ఢిల్లీలోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పని చేసిన గగన్దీప్ కాంగ్.. గతంలో పలు వైరస్లపై చేసిన పరిశోధనల ద్వారా అవార్డులను సొంతం చేసుకున్నారు. అటు నార్వేకు చెందిన సంస్థ చేపట్టిన అంటువ్యాధుల సన్నద్ధత ప్రోగ్రాంకు కూడా ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు.
For More News:
కరోనా అలెర్ట్.. మాస్క్లతో జాగ్రత్త..
కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్కు కివీస్ క్రికెటర్లు డుమ్మా.?
ఒక్కొక్కరు ఆరుగురికి జన్మనివ్వండి.. మహిళలకు దేశాధ్యక్షుడి సూచన..!
నేనే దేవుడ్ని.. కరోనా వచ్చింది నా వల్లే.. క్షమించండి..
జగన్ సర్కార్లో సంచైతకు కీలక స్థానం…? ఇంతకీ ఎవరామె..?