దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాసరెడ్డి

దుబ్బాక ఉప ఎన్నిక అభ్యర్థిని ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాసరెడ్డి పేరును దుబ్బాక అభ్యర్థిగా సోనియా గాంధీ ఖరారు చేశారు.

దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాసరెడ్డి
Follow us

|

Updated on: Oct 07, 2020 | 10:26 PM

దుబ్బాక ఉప ఎన్నిక అభ్యర్థిని ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాసరెడ్డి పేరును దుబ్బాక అభ్యర్థిగా సోనియా గాంధీ ఖరారు చేశారు. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కోర్‌ కమిటీలో సభ్యుడిగా ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చివరి క్షణంలో చెరుకు శ్రీనివాసరెడ్డి పేరును తెరపైకి తీసుకొచ్చారు. దీంతో చెరుకు శ్రీనివాస‌రెడ్డి మంగళవారం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, శ్రీనివాసరెడ్డికి దుబ్బాక టికెట్ దక్కేలా దామోదర్‌ రాజనర్సింహ అంతర్గతంగా కృషీ చేసినట్లు సమాచారం. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కం ఠాగూర్‌తో పలు దఫాల చర్చలు జరిపిన సిద్ధిపేట జిల్లా పార్టీనేతలు.. చివరకి శ్రీనివాసరెడ్డిని పార్టీ అభ్యర్థిత్వానికి ఒకే చెప్పారు. దీంతో ఆయన్ను బరిలో దింపుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.