ప్రసిద్ధ కృష్ణ మందిరం… ఉడిపి!

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:57 PM

శ్రీకృష్ణుడు హిందూమత దేవుడు. ఈయన శ్రీమహావిష్ణువు అవతారాలలో తొమ్మిదవ అవతారం. ‘కృష్ణ’ అనగా నలుపు అని అర్థం. అందుకే కృష్ణుడు అంటే నలుపు రంగు కలిగిఉన్నవాడని ఐతిహ్యం. అనేక దేవాలయాల విగ్రహాలలోనూ, శిల్పాలలోనూ, చిత్రాలలోనూ, ప్రార్థనలోనూ, సాహిత్యం, పురాణాలు, కావ్యాలు ఇలా అన్ని చోట్ల శ్రీకృష్ణుని రూప స్వభావాల చిత్రణ ఉన్నది. కృష్ణాష్టమిని దేశం యావత్తూ తన ఇంట్లో పిల్లవాడి జన్మదినంగానే భావిస్తారు. కృష్ణుడిని అటు చిన్నికన్నయ్యలా భావిస్తూ, ఇటు దేవాధిదేవునిగా తలుస్తూ ఘనంగా జన్మాష్టమి వేడుకలు […]

ప్రసిద్ధ కృష్ణ మందిరం... ఉడిపి!
Follow us on

శ్రీకృష్ణుడు హిందూమత దేవుడు. ఈయన శ్రీమహావిష్ణువు అవతారాలలో తొమ్మిదవ అవతారం. ‘కృష్ణ’ అనగా నలుపు అని అర్థం. అందుకే కృష్ణుడు అంటే నలుపు రంగు కలిగిఉన్నవాడని ఐతిహ్యం. అనేక దేవాలయాల విగ్రహాలలోనూ, శిల్పాలలోనూ, చిత్రాలలోనూ, ప్రార్థనలోనూ, సాహిత్యం, పురాణాలు, కావ్యాలు ఇలా అన్ని చోట్ల శ్రీకృష్ణుని రూప స్వభావాల చిత్రణ ఉన్నది. కృష్ణాష్టమిని దేశం యావత్తూ తన ఇంట్లో పిల్లవాడి జన్మదినంగానే భావిస్తారు. కృష్ణుడిని అటు చిన్నికన్నయ్యలా భావిస్తూ, ఇటు దేవాధిదేవునిగా తలుస్తూ ఘనంగా జన్మాష్టమి వేడుకలు జరుపుకొంటారు. అయితే కొన్ని ఆలయాలలో జన్మాష్టమి, మరింత సంబరంగా సాగుతుంది. జీవితకాలంలో ఒక్కసారైనా ఆ వేడుకని చూడాలని హిందువులంతా పరితపించిపోతారు. అలాంటి కొన్ని ప్రత్యేకమైన ఆలయాలలో ఒకటి ఉడిపి.

ఉడిపి కృష్ణ మందిరం

కర్ణాటకలోని ప్రసిద్ధ కృష్ణ మందిరాలలో ఒకటి. ఇది ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రదేశం. ఉడుపిని దేవాలయాల నగరం అని కూడా పిలుస్తారు. ఉడుపిలో 13 వ శతాబ్దపు కృష్ణ ఆలయం ఉంది. శ్రీకృష్ణుడి పెద్ద విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు.

ఆలయం వెనుక భాగంలో ఉన్న కిటికీ నుంచి స్వామిని దర్శించుకోవడం

కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి క్షేత్రంలో కొలువైన చిన్ని కృష్ణుని ఆలయం హిందువులకు పరమ పవిత్రమైన ప్రాంతం. మఠాధిపతులు తప్ప ఇతరులెవరికీ మూలమూర్తిని తాకే అవకాశం లేదు. ఈ ఆలయం వెనుక భాగంలో ఉన్న కిటికీ నుంచి స్వామిని దర్శించుకోవడం ప్రత్యేకత.

వేడుకగా జన్మాష్టమి

ఉడిపి (కర్ణాటక)లోని శ్రీకృష్ణమఠంలో జన్మాష్టమిని మహావేడుకగా నిర్వహిస్తారు. ద్వైతమత స్థాపకుడైన మధ్వాచార్యులవారు, ఇక్కడి మఠంలోని కృష్ణవిగ్రహాన్ని ప్రతిష్టించారట. అందుకని ఎక్కడెక్కడి వైష్ణవులో ఇక్కడి స్వామివారిని దర్శించుకునేందుకు వస్తారు.

‘విట్టల్ పిండి’ 

ఇక్కడ,శ్రీ కృష్ణ జన్మాష్టమిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. జన్మాష్టమి సందర్భంగా ‘విట్టల్ పిండి’ పేరుతో కృష్ణుని మట్టివిగ్రహాన్ని రూపొందించడం ఓ విశేషం. ఆ విగ్రహాన్ని ఊరేగించిన తర్వాత ఆలయంలోని మధ్వసరోవరంలో నిమజ్జనం చేస్తారు.

శ్రీ కృష్ణ జన్మాష్టమికి 15 రోజుల ముందు నుండి సన్నాహాలు జరుగుతాయి. డెజర్ట్ తయారీ ప్రక్రియ ముందుగానే ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఆలయం మొత్తం అందంగా పువ్వులతో అలంకరించడం జరుగుతుంది. శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టే ఉత్సవం కనిపిస్తుంది.

ఉడిపిలో ప్రతి రెండు సంవత్సరాలకు ప్రత్యామ్నాయ పండుగ జరుగుతుంది. ఈ సందర్భంలో ఎనిమిది మఠాలలో ఈ మందిరం నిర్వహణ ఒకరు నుండి మరికొరికి ఇవ్వబడుతుంది.

 

దగ్గరలో ఉన్న మరికొన్ని ముఖ్య ప్రదేశాలు

  • కోల్లూరుముకాంబికా దేవాలయం
  • మరవంతె బీచ్
  • మల్పే రేవు
  • కాపుదీపస్తంభం (కాపు లైటు హౌసు)
  • కార్కళలోని గోమటేశ్వరుడు
  • వేణూరులోని గోమటేశ్వరుడు
  • అత్తూరులోసెయింట్ లారెన్స్ ఇగర్జి
  • సెయింట్ మేరీస్ ద్వీపం
  • మూడబిదరెలోసావిరకంబద బసది
  • మణిపాల్
  • బైందూరు కోసళ్ళి జలపాతము

ఎలా వెళ్ళాలి 

ఉడిపి జిల్లా రెండు జాతీయరహదార్లు ఉన్నాయి. జాతీయరహదారి17 (ప్రస్తుతం జాతీయరహదారి 66 అని మాత్చబడింది) మరియు రెండవది జాతీయరహదారి 13. జాతీయరహదారి 17 జిల్లా ఉత్తర దక్షిణ దిశగా పయనిస్తూ ఉడిపిని మంగుళూరు, కార్వార్, మురుదేష్వర, కొచ్చి, మద్గావ్, గోవా  రత్నగిరి మరియు ముంబయితో అనుసంధానిస్తుంది. జాతీయరహదారి 13 జిల్లాను షిమొగా, బీజపూర్, సోలాపూర్, చిత్రదుర్గ మరియు హోస్పేటలతో అనుసంధానిస్తుంది.

రైల్వే

కొంకణి రైల్వే జిల్లాను పొరుగు జిల్లాలు మరియు రాష్ట్రాలతో అనుసంధానిస్తుంది. జిల్లాలో ఉడిపి, బైందూర్, కుందపురె వద్ద ప్రధాన రైలు స్టేషన్లు ఉన్నాయి.

వాయు మార్గం

జిల్లాకు అతి సమీపంలోని విమానాశ్రయం జిల్లాకేంద్రం ఉడిపికి 55 కి.మీ దూరంలో బజ్పె వద్ద ” మంగుళూరు విమానాశ్రయం ” ఉంది.