AP Elections 2020: జనసేన అభ్యర్థిగా.. స్థానిక బరిలో.. 70 ఏళ్ల వృద్ధురాలు..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైంది. వివిధ పార్టీల నాయకులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. సరికొత్తరాజకీయ పంథా అంటూ ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మొదటి స్థానిక సమరం
Local Body Polls in AP: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైంది. వివిధ పార్టీల నాయకులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. సరికొత్తరాజకీయ పంథా అంటూ ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మొదటి స్థానిక సమరం బరిలో నిలిచింది. ఇందులో భాగంగా జనసేన నాయకులు నామినేషన్లు వేస్తున్నారు. అయితే బుధవారం జనసేన తరఫున దాఖలైన ఓ నామినేషన్ హైలెట్గా నిలిచింది.
అయితే.. జనసేన పార్టీ విధానాలకు ఆకర్షితురాలై.. పశ్చిమ గోదావరి జిల్లా లంకల కోడేరు ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థిగా శ్రీమతి నల్లమోతు భారతి అనే 70 ఏళ్ల వృద్ధురాలు నామినేషన్ వేశారు. రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆమెను అభినందించారు. వీరి పక్కనే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సన్నిహతుడు, నిర్మాత ‘బన్నీ’ వాసు కూడా ఉన్నారు.
[svt-event date=”11/03/2020,6:38PM” class=”svt-cd-green” ]
పశ్చిమ గోదావరి జిల్లా లంకల కోడేరు ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థిగా శ్రీమతి నల్లమోతు భారతి గారు నామినేషన్ వేశారు. 70 ఏళ్ల భారతి గారు జనసేన పార్టీ విధానాలకు ఆకర్షితురాలై బరిలో నిలిచారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఆమెను అభినందించారు pic.twitter.com/GrtrS55H75
— JanaSena Party (@JanaSenaParty) March 11, 2020
[/svt-event]