మద్యం మత్తులో పామును కొరికిన వ్యక్తి అరెస్ట్..!
మద్యం మత్తులో పామును చంపి మెడలో వేసుకున్న కుమార్ అనే వ్యక్తిని అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు
మద్యం మత్తులో పామును చంపి మెడలో వేసుకున్న కుమార్ అనే వ్యక్తిని అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు.. ఇప్పుడు అరెస్ట్ చేశారు. కాగా కర్ణాటకలోని ముగబాగిలు తాలూకా ముష్టూరు గ్రామంలో కుమార్ అనే వ్యక్తి ఫుల్లుగా తాగి బైక్లో వెళ్తుండగా.. పాము కనిపించింది. తాగిన మైకంలో దాన్ని చేతుల్లోకి తీసుకున్న కుమార్.. పామును కొరికి చంపేశాడు. ఆ తరువాత మెడలో వేసుకున్నాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు.. కుమార్ను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే దాదాపు 40 రోజుల లాక్డౌన్ తరువాత మద్యం షాపులు తెరుచుకోవడంతో.. దేశవ్యాప్తంగా మందుబాబులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మద్యం ఇచ్చిన కిక్తో వింత వింత చేష్టలు చేస్తున్నారు.
Read This Story Also: వైజాగ్ గ్యాస్ లీకేజీ: వామ్మో.. స్టెరీన్ వల్ల ఇన్ని సైడ్ ఎఫెక్ట్లా..!