కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. అదుపు తప్పి బోల్తా పడ్డ ట్రావెల్స్ బ‌స్సు.. 35 మందికి గాయాలు

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో సిరి ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 35 మందికి...

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. అదుపు తప్పి బోల్తా పడ్డ ట్రావెల్స్ బ‌స్సు.. 35 మందికి గాయాలు
Follow us

|

Updated on: Dec 24, 2020 | 6:24 AM

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో సిరి ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 35 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించి గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయాలైన వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

కాగా, ఈ ట్రావెల్స్ బ‌స్సు విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బ‌స్సులో 50 మంది ఉన్న‌ట్లు తెలుస్తోంది. బాధితులు విశాఖ‌, ఒడిశాకు చెందిన వారుగా గుర్తించారు.

సోమాజిగూడలో రోడ్డుప్రమాదం.. అదుపుతప్పిన జీపు బోల్తా.. నలుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం