పాక్ దౌత్యాధికారికి భారత్ సమన్లు, సరిహద్దులో కాల్పుల విరమణకు తూట్లు పొడవడంపై ఆగ్రహం

జమ్మూకశ్మీర్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పాక్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుండటంపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది.

పాక్ దౌత్యాధికారికి భారత్ సమన్లు, సరిహద్దులో కాల్పుల విరమణకు తూట్లు పొడవడంపై ఆగ్రహం
Follow us

|

Updated on: Nov 15, 2020 | 8:07 AM

జమ్మూకశ్మీర్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పాక్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుండటంపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. నవంబర్ 13 నాటి కాల్పుల ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్న ఇండియా.. పాక్ దౌత్యాధికారికి సమన్లు జారీ చేసింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్‌(పీఏఐ) డెస్క్‌లోని భారత విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ జేపీ సింగ్ కూడా పాకిస్తాన్ హైకమిషన్‌పై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

భారత్‌లో పండుగ వాతావరణం ఉన్నసమయంలో ఉద్దేశపూర్వకంగా సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. హింసను వ్యాప్తి చేసేలా పాకిస్థాన్ వైపు నుంచి జరుగుతున్న చర్యలను, సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాటుకు ఆ దేశం నుంచి అందుతున్న మద్దతును తప్పుబట్టింది. జమ్ము కశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ శుక్రవారం కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ ఘటనలో నలుగురు భారత జవాన్లు అమరులవ్వగా… మరో ఆరుగురు పౌరులు చనిపోయారు. పాక్ కాల్పులకు భారత సైన్యం ఎదురుకాల్పులతో ధీటుగా కౌంటరిచ్చింది. దీంతో 11 మంది పాకిస్తాన్ జవాన్లు చనిపోయారు. మరో 16 మంది గాయపడ్డారు.

ఈ క్రమంలో  ఎల్ఓసీ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలను భారత బలగాలు పేల్చేశాయి. ఇటీవలే ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన స్పైక్ యాంటీ ట్యాంక్ మిస్సైల్స్‌ను పాక్ స్థావరాలపై ఇండియా సంధించింది. ఆయుధ కేంద్రాలు, బంకర్లు, టెర్రరిస్టులను భారత్‌లోకి పంపించేందుకు ఏర్పాటు చేసిన స్థావరాలను పేల్చేసింది. చనిపోయిన పాక్ సైనికుల్లో స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమెండోలు ఇద్దరు ఉన్నట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి.

Also Read : 

బిగ్ బాస్ 4 : ఇంటి నుంచి మెహబూబ్ ఔట్, అనుకున్నదే జరిగింది

కొవిడ్ కేర్ కేంద్రంలో దీపావళి వేడుకలు, కరోనా బాధితుల్లో కాస్త ఆనందం నింపేందుకు ప్రయత్నం

Latest Articles
అసలేంటీ ఆఫీస్ పికాకింగ్.. దీని ఉద్దేశం ఏంటి.?
అసలేంటీ ఆఫీస్ పికాకింగ్.. దీని ఉద్దేశం ఏంటి.?
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
నాగార్జున సినిమాకు ఆ స్టార్ హీరో అసిస్టెంట్ డైరెక్టర్..
నాగార్జున సినిమాకు ఆ స్టార్ హీరో అసిస్టెంట్ డైరెక్టర్..
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేసేదీ ఎప్పుడంటే?
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేసేదీ ఎప్పుడంటే?
డీహైడ్రేట్ బారిన పడుతున్నారా డైట్‌లో ఈ జ్యుసి పండ్లను చేర్చుకోండి
డీహైడ్రేట్ బారిన పడుతున్నారా డైట్‌లో ఈ జ్యుసి పండ్లను చేర్చుకోండి
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ