నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇలా…
తెలుగు రాష్ట్రాల్లో నైరుతు రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. చత్తీస్ గఢ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తా ఆంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి నేపథ్యంలో రాగాల మరో 72 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు.. రాష్ట్రంలో పలుచోట్ల శనివారం ఎండ తీవ్రత కొనసాగింది. కొన్నిచోట్ల మేఘాలు ఆవరించి ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. పొన్నూరులో 100, […]
తెలుగు రాష్ట్రాల్లో నైరుతు రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. చత్తీస్ గఢ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తా ఆంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి నేపథ్యంలో రాగాల మరో 72 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో వర్షాలు..
రాష్ట్రంలో పలుచోట్ల శనివారం ఎండ తీవ్రత కొనసాగింది. కొన్నిచోట్ల మేఘాలు ఆవరించి ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. పొన్నూరులో 100, అంబాజీపేటలో 60, గోస్పాడులో 53 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. 28న కోస్తాంధ్రలో అనేక చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
తెలంగాణలో వర్షాలు..
ఇక తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్తో పాటు వివిధ జిల్లా వర్షాలు అధిక వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.