జమ్మూకశ్మీర్​లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలోని డయాల్‌గామ్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.  ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న రిపోర్ట్ అందడంతో డయల్​గావ్ ప్రాంతంలో బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి.  గాలింపు చర్యలు చేపడుతుండగా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు.  వారికి దీటుగా బదులిచ్చిన భారత సైన్యం నలుగురు ముష్కరులను మట్టుబెట్టింది. కుప్వారా జిల్లాలో ఇద్దరు మిలిటెంట్స్‌ని అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. వారి వద్ద నుంచి […]

జమ్మూకశ్మీర్​లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం
Follow us

|

Updated on: Mar 15, 2020 | 4:14 PM

జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలోని డయాల్‌గామ్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.  ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న రిపోర్ట్ అందడంతో డయల్​గావ్ ప్రాంతంలో బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి.  గాలింపు చర్యలు చేపడుతుండగా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు.  వారికి దీటుగా బదులిచ్చిన భారత సైన్యం నలుగురు ముష్కరులను మట్టుబెట్టింది.

కుప్వారా జిల్లాలో ఇద్దరు మిలిటెంట్స్‌ని అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. వారి వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని ఉత్తర కాశ్మీర్ జిల్లాలోని విల్గం ప్రాంతంలోని షేక్‌పోరా తారత్‌పోరా నివాసితులు నజీర్ అహ్మద్ వాని, బషీర్ అహ్మద్ వానిగా గుర్తించారు.

Latest Articles