సుశాంత్ ఫ్యాన్స్ డిమాండ్.. మద్దతిచ్చిన ఏఆర్ రెహమాన్
గత కొన్ని నెలలుగా డిప్రెషన్తో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆదివారం ఆత్మహత్య చేసుకొని తనువు చాలించిన విషయం తెలిసిందే.
గత కొన్ని నెలలుగా డిప్రెషన్తో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆదివారం ఆత్మహత్య చేసుకొని తనువు చాలించిన విషయం తెలిసిందే. ఆయన ఆకస్మిక మరణం ఫ్యాన్స్తో పాటు సామాన్యులను బాధించింది. మంచి టాలెంట్ ఉన్న నటుడు ఇలా చేయకుండా ఉండాల్సింది అంటూ బాధతప్తమైన హృదయంతో అందరూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే సుశాంత్ మృతి నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ కొత్త డిమాండ్ చేస్తున్నారు.
సుశాంత్ నటించిన చివరి చిత్రం ‘దిల్ బేచరా’ సినిమాను థియేటర్లో విడుదల చేయాలని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. నిజానికి ఎప్పుడో షూటింగ్ని పూర్తి చేసుకున్న ఈ మూవీ గతేదాడి నవంబర్లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండేది. కానీ కొన్ని కారణాల వలన ఈ సంవత్సరం మే 8కి వాయిదా పడింది. ఇక కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో చాలా సినిమాలు ఆన్లైన్లో విడుదల అవుతుండగా.. దిల్ బేచరాను కూడా ఆన్లైన్లో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. మూవీని థియేటర్లోనే రిలీజ్ చేయాలని DilBecharaOnBigScreen హ్యాష్ట్యాగ్తో ట్వీట్లు చేస్తున్నారు. కనీసం ఇలాగైనా సుశాంత్కి నివాళులు అర్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఎన్ని రోజులైనా తాము ఎదురుచూస్తామని వారు అంటున్నారు. ఇక ఈ డిమాండ్పై ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ మద్దతివ్వడం విశేషం.
కాగా జాన్ గ్రీన్స్ రాసిన ద పాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ ఆధారంగా దిల్ బేచరా తెరకెక్కింది. ఈ చిత్రంలో సుశాంత్ సరసన సంజనా సంగి నటించగా.. సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటించారు. ముఖేష్ చాబ్రా దర్శకత్వం వహించగా ఈ సినిమాను ప్రముఖ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. మరి ఈ డిమాండ్పై దర్శకనిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Read This Story Also: ‘కరోనా ఫ్రీ’గా ప్రకటించిన వారంలోనే.. ఆ దేశంలో కొత్త కేసులు
Fans Wish to See Sushant Singh Rajput's Last Film in Theaters, #DilBecharaOnBigScreen Trends https://t.co/r4fxRVZyyS
— A.R.Rahman (@arrahman) June 16, 2020