Virata Parvam: విరాటపర్వం రివ్యూ ఇచ్చేసిన డీజే టిల్లు.. ఓ కళాఖండం చూసి మంత్రముగ్ధుడయ్యానంటూ..

|

Jun 12, 2022 | 10:15 AM

నిన్న రాత్రి విరాటపర్వం సినిమా చూసి మంత్రముగ్దుడయ్యాను.. రానా, సాయి పల్లవి ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా కనిపించారు.

Virata Parvam: విరాటపర్వం రివ్యూ ఇచ్చేసిన డీజే టిల్లు.. ఓ కళాఖండం చూసి మంత్రముగ్ధుడయ్యానంటూ..
Virata Parvam
Follow us on

డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న విరాట పర్వం (Virata Parvam) సినిమా అంచనాలు భారీగానే ఉన్నాయి. 1990లో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, రానా దగ్గుబాటి జంటగా నటించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ సినిమా ఏ రెంజ్‏లో ఉండబోతుందనేది విషయాన్ని తెలియజేశాయి. నక్సల్స్ నేపథఅయంలో వస్తోన్న ఈ మూవీలో నక్సలైట్ రవి శంకర్ అలియాస్ రవన్న పాత్రలో రానా కనిపించనుండగా.. వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. ఇందులో ప్రియమణి, నవీన్ చంద్ర కీలకపాత్రలలో నటించిన సంగతి తెలిసిందే. అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా గడిపేస్తుంది. తాజాగా విరాటపర్వం సినిమాపై రివ్యూ ఇచ్చేశారు యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ.

” నిన్న రాత్రి విరాటపర్వం సినిమా చూసి మంత్రముగ్దుడయ్యాను.. రానా, సాయి పల్లవి ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా కనిపించారు. విరాటపర్వం చక్కటి కళాఖండం.. చాలా ఉత్సాహంగా ఉంది.. ఈ చిత్రయూనిట్ కు అభినందనలు. ” అంటూ ట్విట్ చేశాడు సిద్దూ జొన్నలగడ్డ. విరాట పర్వం సినిమా ద్వారా ఓ అందమైన ప్రేమకథను చూపించబోతున్నామని.. వెన్నెల జీవితమే ఈ సినిమా అంటూ గతంలో చిత్రయూనిట్ చెప్పిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్‏టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.