Dr Rajasekhar: ‘చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నాం’.. జూబ్లీ హిల్స్ డ్రైనేజీ సమస్యపై రాజశేఖర్ సంచలన ట్వీట్‌

|

Jul 29, 2024 | 6:14 PM

హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలంటూ ప్రముఖ సినీ నటుడు సంబంధిత అధికారులను కోరారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 70లోని అశ్విని హైట్స్‌లో డ్రైనేజీ లీక్‌ సమస్య చాలా కాలంగా ఇబ్బందులకు గురిచేస్తుందని, దీని గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Dr Rajasekhar: చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నాం.. జూబ్లీ హిల్స్ డ్రైనేజీ సమస్యపై రాజశేఖర్ సంచలన ట్వీట్‌
Tollywood Actor Dr Rajasekhar
Follow us on

హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలంటూ ప్రముఖ సినీ నటుడు సంబంధిత అధికారులను కోరారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 70లోని అశ్విని హైట్స్‌లో డ్రైనేజీ లీక్‌ సమస్య చాలా కాలంగా ఇబ్బందులకు గురిచేస్తుందని, దీని గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు సత్వర పరిష్కారం చూపించాలని కోరుతూ.. అక్కడి పరిస్థితిని తెలియజేసే ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు రాజశేఖర్. అలాగే తన పోస్టుకు జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయ లక్ష్మి, కమిషనర్ తో పాటు తదితర ఉన్నతాధికారలను ట్యాగ్‌ చేశారు. ‘జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 70లోని అశ్వినీ హైట్స్‌ వద్ద డ్రైనేజీ లీక్‌ సమస్య ఉంది. ఈ సమస్య చాలా రోజుల నుంచి వేధిస్తోన్నా జీహెచ్‌ఎంసీ పట్టించుకోవడం లేదు. వెంటనే చర్యలు తీసుకోవాలని మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీని విజ్ఞప్తి చేస్తున్నా’ అని రాజశేఖర్‌ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇక సినిమాల విషయానికొస్తే.. చివరిసారిగా నితిన్ ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్ లో ఒక కీలక పాత్రలో మెరిశారు డాక్టర్ రాజశేఖర్. అంతకు ముందు శేఖర్ సినిమాలో సోలో హీరోగా నటించారు. ఆయన తదుపరి సినిమాల గురించి ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉంది. ఇక రాజశేఖర్, జీవిత ఇద్దరు కూతుళ్లు కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణిస్తున్నారు. ముఖ్యంగా శివానీ రాజశేఖర్ వరుసగా సినిమాలు చేస్తోంది. ‘అద్భుతం’ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’, ‘అన్బరివు’, ‘నెంజుక్కు నీతి’, ‘శేఖర్‌’, ‘కోట బొమ్మాళి పీ.ఎస్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుందీ స్టార్ కిడ్. అలాగే అహనా పెళ్లంట వంటి క్రేజీ వెబ్ సిరీస్ తో ఓటీటీ ఆడియెన్స్ ను అలరించంది. ఇటీవల శివానీ హీరోయిన్ గా నటించిన విద్యా వాసుల అహం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

హీరో రాజశేఖర్ ట్వీట్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.