Tollywood: రెండు బొమ్మ పులుల మధ్య రాయల్ బెంగాల్ టైగర్.. ఈ ఫొటోలోని స్టార్ హీరోను గుర్తు పట్టారా?

|

Aug 23, 2024 | 8:14 AM

అదేదో సినిమాలో చెప్పినట్లు మార్కెట్ లో ఈ హీరో క్రేజ్ చూస్తే మెంటలెక్కిపొద్ది అన్న డైలాగ్ ఈ స్టార్ హీరోకు సరిగ్గా సరిపోతుంది. అలాగనీ అతను భారీ సినిమాలు, పాన్ ఇండియా మూవీస్ చేయలేదు. పైగా గత కొన్నేళ్లుగా పరిమితంగానే సినిమాలు చేస్తున్నాడు. కానీ ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు

Tollywood: రెండు బొమ్మ పులుల మధ్య రాయల్ బెంగాల్ టైగర్.. ఈ  ఫొటోలోని స్టార్ హీరోను గుర్తు పట్టారా?
Tollywood Actor Childhood Photo
Follow us on

పై ఫొటోను గమనించారా? రెండు బెంగాల్ టైగర్స్ బొమ్మల మధ్య సోదరితో కలిసి సరదాగా పోజులిచ్చిన ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఆయన టాలీవుడ్ సెన్సేషనల్ హీరో. ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా ఆయన పేరు వింటే చాలు అభిమానుల్లో పూనకాలు వస్తాయి. అదేదో సినిమాలో చెప్పినట్లు మార్కెట్ లో ఈ హీరో క్రేజ్ చూస్తే మెంటలెక్కిపొద్ది అన్న డైలాగ్ ఈ స్టార్ హీరోకు సరిగ్గా సరిపోతుంది. అలాగనీ అతను భారీ సినిమాలు, పాన్ ఇండియా మూవీస్ చేయలేదు. పైగా గత కొన్నేళ్లుగా పరిమితంగానే సినిమాలు చేస్తున్నాడు. కానీ ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. పైగా రోజురోజుకు ఈ హీరో పాపులారిటీ అమాంతం పెరుగుతోంది. అన్నయ్య వారసత్వంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తన స్టైల్, యాక్టింగ్ తో అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే సమయంలో రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. పొలిటికల్ పార్టీ ప్రారంభించి ప్రారంభంలోనే ఎదురు దెబ్బలు తిన్నాడు. లెక్కలేనన్ని విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ ప్రతి ఒక్కరికీ ఒక టైమ్ వస్తుంది. ఇప్పుడు ఆయనకు వచ్చింది. అందుకే గతంలో ఏ పార్టీ సాధించలేనంతగా 100 శాతం స్ట్రైక్ రైట్ తో ఘన విజయం సాధించాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఆయన మరెవరో కాదు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.

సాధారణంగా పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. పైగా పొలిటికల్ అప్ డేట్స్ మాత్రమే తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో షేర్ చేస్తుంటాడు. అలాంటిది చాలా రోజుల తర్వాత తన అన్నయ్య చిరంజీవి పుట్టిన రోజున సోషల్ మీడియాలో ఒక త్రో బ్యాక్ ఫొటోను పంచుకున్నారు. అందులో ఆయన, తన సోదరి మాధవితో కలిసి పోజులిచ్చారు. ముందు బొమ్మ పులుల, బ్యాక్ గ్రౌండ్ లో ఓ భవనం కనిపిస్తుండగా… పవన్, మాధవి చేయి చేయి పట్టుకుని నిల్చుని ఉండడం ఆ ఫొటోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ ఫొటోపై పవన్ స్పందిస్తూ… ఇదొక మధురమైన జ్ఞాపకం అని పేర్కొన్నారు. బెంగాల్ టైగర్ల ప్రతిరూపాల వద్ద తాము ఫొటోకి పోజు ఇచ్చామన్నారు పవర్ స్టార్. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఫొటోలో ఉన్నది ‘రెండు బెంగాల్ టైగర్స్ కాదు.. మొత్తం మూడు టైగర్స్’ అంటూ పవన్ కళ్యాణ్‌ పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.