Tollywood: తెలుగు కుర్రాళ్లకు ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం.. హీరోలతో సమానంగా ఫాలోయింగ్.. ఎవరో గుర్తుపట్టగలరా..?

తెలుగు, తమిళ్, హిందీలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ హీరోయిన్ సినిమాల కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. అలాగే ఆమెతో డాన్స్ అంటే హీరోలు సైతం క్షణం ఆలోచించాల్సిందే. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటన ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఆమెను ముద్దుగా లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. ఇప్పుడు గుర్తుపట్టే ఉంటారు కదా..

Tollywood: తెలుగు కుర్రాళ్లకు ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం.. హీరోలతో సమానంగా ఫాలోయింగ్.. ఎవరో గుర్తుపట్టగలరా..?
Actress
Follow us

|

Updated on: Apr 16, 2024 | 8:34 PM

సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు హీరోలతో సమానంగా క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్, హిందీలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ హీరోయిన్ సినిమాల కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. అలాగే ఆమెతో డాన్స్ అంటే హీరోలు సైతం క్షణం ఆలోచించాల్సిందే. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటన ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఆమెను ముద్దుగా లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. ఇప్పుడు గుర్తుపట్టే ఉంటారు కదా.. తనే న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన చిన్ననాటి ఫోటో నెట్టింట వైరలవుతుంది.

సాయి పల్లవి సౌత్ ఇండియన్ సినిమాలో అత్యంత ఇష్టపడే హీరోయిన్. కానీ ఈ బ్యూటీ మలయాళీ కుట్టి. ‘ప్రేమమ్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి.. మొదటి సినిమాతోనే వెండితెరపై అద్భుతం చేసింది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తక్కువ మేకప్.. అంతకు మించి పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఫస్ట్ మూవీ తర్వాత తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టినా నటన ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో అలరించింది.

ఇప్పుడు నాగచైతన్య జోడిగా తండేల్ చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ చందూ మోండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు చిత్రాల్లో నటిస్తుంది. తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని కోటగిరి అనే కొండ ప్రాంతంలో పుట్టి పెరిగిన సాయి పల్లవి తన బాల్యాన్ని కోయంబత్తూరులో గడిపింది. సాయి పల్లవి మే 9, 1992న సెంథామరై కన్నన్, రాధ దంపతులకు జన్మించింది. అలాగే ఫెయిర్‌నెస్‌ కంపెనీకి కోట్ల రూపాయల ఆఫర్‌ వచ్చినా అందులో నటించేందుకు నిరాకరించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం