Tollywood: ‘యజ్ఞం’ సినిమాలో గోపీచంద్‌ను ఆటపట్టించిన ఈ హీరోయిన్ ఇప్పుడెం చేస్తుందో తెలుసా.?

|

Feb 02, 2023 | 12:42 PM

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు లాంగ్ రన్ అవ్వాలంటే అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. అయితే..

Tollywood: యజ్ఞం సినిమాలో గోపీచంద్‌ను ఆటపట్టించిన ఈ హీరోయిన్ ఇప్పుడెం చేస్తుందో తెలుసా.?
Yagnam Heroine
Follow us on

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు లాంగ్ రన్ అవ్వాలంటే అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. అయితే ఈ మూడు క్వాలిటీస్ ఉన్నా కూడా.. కొందరికి అవకాశాలు ఎక్కువగా రావు. కేవలం ఒకట్రెండు సినిమాలకే కనుమరుగైపోతారు. ఆ కోవకు చెందిన హీరోయిన్ ‘సమీరా బెనర్జీ’. ఈ పేరు మీకు పెద్దగా గుర్తుండకపోవచ్చు. కానీ గోపీచంద్ హీరోగా నటించిన ‘యజ్ఞం’ సినిమా మీకు కచ్చితంగా గుర్తుంటుంది. ఆ మూవీలో హీరోయిన్‌గా నటించి.. ప్రేక్షకులను పలకరించింది ఈ బ్యూటీ.

అప్పుడే హీరోగా ఎదుగుతున్న గోపిచంద్‌ కెరీర్‌లో ఈ సినిమా మైలురాయిగా నిలవగా.. హీరోయిన్ సమీరా బెనర్జీకి మాత్రం ఏమాత్రం ఉపయోగపడలేదు. ఈ మూవీ తర్వాత ఆమెకు ఎలాంటి అవకాశాలు తలుపు తట్టలేదు. టాలీవుడ్‌లో మంచి అవకాశం కోసం ఆమె ఎదురు చూసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో తన స్వస్థలమైన కోల్‌కతా వెళ్లిపోయింది సమీరా బెనర్జీ. అక్కడే నీరజ్ శర్మ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్ళాడింది. ప్రస్తుతం వీరికి ఒక బాబు ఉన్నాడు. ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ షూరూ చేసిన సమీరా బెనర్జీ.. బెంగాలీ సీరియల్స్‌లో పలు కీలక పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం