Shruti Haasan: మానసిక సమస్యలతో ఇబ్బందిపడుతున్న శ్రుతిహాసన్.. అందుకు చికిత్స తీసుకుంటుందట..

|

Jan 12, 2023 | 4:16 PM

శ్రుతిహాసన్ నటించిన వీరసింహా రెడ్డి చిత్రం ఈరోజు విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగా.. జనవరి 13న వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఎప్పుడూ నెట్టింట యాక్టివ్ గా ఉండే శ్రుతి హాసన్.. తాజాగా తన వ్యక్తిగత విషయాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కొద్ది రోజులుగా తాను మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంది.

Shruti Haasan: మానసిక సమస్యలతో ఇబ్బందిపడుతున్న శ్రుతిహాసన్.. అందుకు చికిత్స తీసుకుంటుందట..
Shruti Haasan
Follow us on

కమల్ హాసన్ నటవారసురాలిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రుతిహాసన్… అతి తక్కువ సమయంలోనే దక్షిణాదిలోనే అగ్రకథానాయికగా పేరు సంపాదించుకుంది. కేవలం నటిగానే కాకుండా సింగర్‏గానూ ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే ప్రేమ.. రిలేషన్ షిప్ అంటూ ఇండస్ట్రీకి దూరమయ్యింది. కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ మాస్ మాహారాజా రవితేజ నటించిన క్రాక్ సినిమా రీఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న ఈ హీరోయిన్.. ఇప్పుడు చేతి నిండ సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఆమె నటించిన వీరసింహా రెడ్డి చిత్రం ఈరోజు విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగా.. జనవరి 13న వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఎప్పుడూ నెట్టింట యాక్టివ్ గా ఉండే శ్రుతి హాసన్.. తాజాగా తన వ్యక్తిగత విషయాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కొద్ది రోజులుగా తాను మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంది.

శ్రుతి హాసన్ మాట్లాడుతూ.. “నాకు కొన్ని మానసిక సమస్యలు ఉన్నాయి. ఉన్నట్టుండి ఎక్కువగా ఉద్రేకపడతాను. కొన్ని విషయాలకు వెంటనే కోపం వచ్చేస్తుంది. నా సమస్యల గురించి బయటకు చెప్పడానికి ముందు భయపడ్డాను. ఈ మధ్య చాలా మంది తమ సమస్యలను బయటకు చెప్పేస్తున్నారు. అందుకే నేను కూడా నా మానసిక రుగ్మతల గురించి చెప్పాలి అనిపించింది. ప్రస్తుతం ఆ సమస్యలకు చికిత్స తీసుకుంటున్నాను. మానసిక రుగ్మతలను తగ్గించడానికి సంగీతం కూడా ఉపయోగపడుతుంది. అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే అది షూటింగ్ స్పాట్ లో అయినా.. ఇంట్లో అయినా కోపం వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితి తీవ్రం అయితే వెంటనే థెరపీ చికిత్సకు వెళ్తున్నాను. నా సమస్యలను నేను దాచాలనుకోవడం లేదు ” అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

అయితే తాను ఎదుర్కొంటున్న ఈ మెంటల్ హెల్త్ సమస్యల గురించి బయటకు చెబితే భారం తగ్గడమే కాకుండా పరిష్కారం కూడా లభిస్తుందని అన్నారు శ్రుతి. ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సలార్ సినిమాలో నటిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.