వేణు మాధవ్ చివరి ఫొటో చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

ప్రముఖ టాలీవుడ్ కమేడియన్ కమ్ హీరో వేణు మాధవ్ బుధవారం కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. దీంతో.. పాటుగా కిడ్నీ సమస్య కూడా ఉండటంతో.. ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించి మరణించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించిన వేణుమాధవ్ జన్మించారు. వేణుమాధవ్ భార్య శ్రీవాణి, ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో […]

వేణు మాధవ్ చివరి ఫొటో చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
Follow us

| Edited By:

Updated on: Sep 25, 2019 | 8:48 PM

ప్రముఖ టాలీవుడ్ కమేడియన్ కమ్ హీరో వేణు మాధవ్ బుధవారం కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. దీంతో.. పాటుగా కిడ్నీ సమస్య కూడా ఉండటంతో.. ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించి మరణించారు.

సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించిన వేణుమాధవ్ జన్మించారు. వేణుమాధవ్ భార్య శ్రీవాణి, ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన.. ‘సంప్రదాయం’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. నాలుగో ఏట నుంచే ఆయన మిమిక్రీ చేయడం ప్రారంభించారు. కాగా.. ‘లక్ష్మీ’ సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నారు. సినిమాలతో పాటు పలు టీవీ ప్రోగ్రాములు కూడా చేశారు.

అయితే.. వేణుమాధవ్ చివరి ఫొటో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతున్నది. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ప్రముఖ హీరో రాజశేఖర్ వెళ్లి పరామార్శిస్తున్నప్పుడు తీసిన ఫొటో అది. తాజాగా.. కుటుంబసభ్యులు ఆ ఫొటోను విడుదల చేశారు. ఈ ఫొటో చూస్తుంటే.. వేణుమాధవ్‌ని గుర్తు పట్టడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. వేణు ఆరోగ్యం ఎంతా క్షీణించిందో.. అతని ముఖంలోనే కనిపిస్తోంది.