Mohan Babu: ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే ఆయనను కరోనా ఏమీ చేయలేదు: మోహన్ బాబు

| Edited By: Rajitha Chanti

Apr 21, 2021 | 7:04 AM

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్  కల్లోలాన్ని సృష్టిస్తుంది. దాంతో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకు రెండు లక్షలకు

Mohan Babu: ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే ఆయనను కరోనా ఏమీ చేయలేదు: మోహన్ బాబు
Mohan Babu
Follow us on

Mohan Babu

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్  కల్లోలాన్ని సృష్టిస్తుంది. దాంతో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకు రెండు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.. భారీగా మరణాలు సంభవిస్తున్నాయి. సామాన్యుల నుంచి సినీ నటులు,రాజకీయ నేతలు, అధికారులు అందరూ ఈ కరోనా వైరస్ బాధితులుగా మారిపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా విషయం తెలిసిందే. కేసీఆర్ కు కరోనా అని తెలిసి కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్ లో వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని అందరు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంల్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా కేసీఆర్ త్వరగా కరోనా నుంచి బయట పడాలని కోరుకున్నారు. మోహన్ బాబు కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘పోరాటయోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు… ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే ఆయనను కరోనా ఏమీ చేయలేదు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆ షిరిడీ సాయినాథుడుని కోరుకుంటున్నాను’ అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Bollywood Music Director: చిత్ర పరిశ్రమలో ఆగని కరోనా కల్లోలం..బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ ఆరోగ్య పరిస్థితి విషమం..

కరోనా బారిన పడ్డ జబర్దస్త్ బ్యూటీ.. పరిస్థితి మరీ దారుణంగా ఉంది అంటూ ఎమోషనల్….

Karthika Deepam : దీప కు ఎవరో రాంగ్ డ్రగ్ ఇచ్చారని తెలుసుకున్న కార్తీక్.. డాక్టర్ బాబు ప్రేమ నిజమేనాఅని ఆలోచిస్తున్న దీప