బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమా సెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్.. కృతి సనన్ జంటగా నటిస్తోన్న చిత్రం బచ్ పన్ పాండే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్లో నిన్న ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్య్కూట్ వలన ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. మంటలు అంటుకునే సమయంలో అక్షయ్ కుమార్, కృతి సనన్ కూడా అక్కడే ఉన్నారని సమాచం.
ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సిద్దార్థ, లక్ష్మీ మీనన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను దక్షిణాది చిత్రం జిగార్తాండకు రీమేక్ అన్న ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై ఆసక్తిని పెంచాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అక్షయ్ కుమార్ సెల్ఫీ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి రాజ్ మెహతా దర్శకత్వం వహిస్తుండగా.. అరున భాటియా, యశ్ జోహర్, సుప్రియ మీనన్, కరణ్ జోహార్, పృథ్వీరాజ్ సుకుమారన్, అపూర్వ మెహతా, లిస్టిన్ స్టెఫెన్ నిర్మిస్తున్నారు.
Also Read: Naga Chaitanya: ఆ విషయంలో నాకు సమంతే బెస్ట్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగచైతన్య..
Pushpa Srivalli Dance: శ్రీవల్లి పాటకు స్టెప్పులేసి టీమిండియా క్రికెటర్లు.. అదరగొట్టేశారుగా.!
Anasuya Bharadwaj: అనసూయ తమిళ్ మూవీ నయా పోస్టర్ చూశారా.. ఆకట్టుకుంటోన్న అందాల భామ..