Ranbir Kapoor: ఎవర్రా బాబు నువ్వు..! బూతులు మాట్లాడిన ఫోటోగ్రాఫర్.. రణబీర్ ఏం చేశాడంటే..

జిమ్, రెస్టారెంట్, ఈవెంట్స్ ఇలా ఎక్కడికి వెళ్లినా కూడా ఫోటో గ్రాఫర్స్ సెలబ్రెటీల ఫోటోలు తీస్తూ ఉంటారు. కొంతమంది సహానంత ఫోటోలకు ఫోజులిస్తే మరికొంతమంది మాత్రం ఆవేశంతో ఫోటోగ్రాఫర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కు ఊహించని సంఘటన ఎదురైంది.

Ranbir Kapoor: ఎవర్రా బాబు నువ్వు..! బూతులు మాట్లాడిన ఫోటోగ్రాఫర్.. రణబీర్ ఏం చేశాడంటే..
Ranbir Kapoor
Follow us

|

Updated on: Apr 28, 2024 | 11:53 AM

బాలీవుడ్ లో ఫోటోగ్రాఫర్స్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు.. సెలబ్రెటీలు ఎక్కడ కనిపించిన ఫోటోల కోసం ఎగబడుతూ ఉంటారు. ఎలాంటి పరిస్థితిలోనైనా ఫొటోలో క్లిక్ మనిపిస్తారు. జిమ్, రెస్టారెంట్, ఈవెంట్స్ ఇలా ఎక్కడికి వెళ్లినా కూడా ఫోటో గ్రాఫర్స్ సెలబ్రెటీల ఫోటోలు తీస్తూ ఉంటారు. కొంతమంది సహానంత ఫోటోలకు ఫోజులిస్తే మరికొంతమంది మాత్రం ఆవేశంతో ఫోటోగ్రాఫర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కు ఊహించని సంఘటన ఎదురైంది. ఓ ఫోటో గ్రాఫర్ అసభ్యపదజాలం వాడటంతో రణబీర్ షాక్ అయ్యాడు.

గుజరాత్‌లోని సూరత్‌లో రణబీర్ కపూర్ ఆభరణాల దుకాణాన్ని ప్రారంభించాడు. అతడి ఫొటోలు తీసేందుకు వచ్చిన ఓ పాపారాజీ అతడిని అసభ్య పదజాలంతో దూషించాడు. అది విని రణబీర్ కపూర్ షాక్ అయ్యాడు. అతను చాలా ఆశ్చర్యంగా ఫోటోగ్రాఫర్ వైపు చూశాడు. ‘ఏమి జరుగుతుంది ఇక్కడ?’ అని అడిగాడు రణబీర్ కపూర్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రణబీర్ కపూర్ ఫోటోలు తీయడానికి చాలా మంది ఫోటోగ్రాఫర్స్ వచ్చారు. చాలా మంది అక్కడికి చేరుకోవడంతో ఈ సందర్భంలో సహనం కోల్పోయిన ఓ ఫోటోగ్రాఫర్.. పరుష పదజాలంతో అరిచాడు. అయితే అతను బూతులు తిట్టింది రణబీర్ కపూర్‌నా లేక అక్కడున్న వారిలో ఎవరికైనా తిట్టాడా అనేది ఖచ్చితంగా తెలియడం లేదు. ఆ ఫోటోగ్రాఫర్ వాడిన అసభ్య పదజాలం విని రణబీర్ కపూర్ కి కోపం వచ్చింది. అసహనంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఏం జరుగుతుంది అని అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ  మీడియాలో వైరల్హీ అవ్వడంతో .. ఆ ఫోటో గ్రాఫర్నం ను  నెటిజన్స్గా కామెంట్స్ లో తిడుతున్నారు. రణబీర్ కపూర్ ఇప్పుడు రామాయణం సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించింది.ఇక ఇప్పుడు రామాయణం సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో అతనికి జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. ‘దంగల్‌’ ఫేమ్‌ దర్శకుడు నితీష్‌ తివారీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ సెట్స్ నుండి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. దాంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.