Viral Photo: ఇటీవల నటీమణులు తమ వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు కేవలం న్యూస్ పేపర్లలో వచ్చే ఫోటోలను మాత్రమే అభిమానులు చూసుకునే అవకాశం ఉండేది. కానీ ఎమంటూ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో.. నటీమణులే స్వయంగా తమ ఫోటోలను, వ్యక్తిగత విషయాలను, వీడియోలను పంచుకుంటున్నారు. అంతటితో ఆగకుండా తమ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కూడా చెబుతున్నారు. ఇక తమ చిన్న నాటి ఫోటోలతో పాటు, ‘గుర్తుపట్టండి.. ‘ అంటూ కనిపించి కనిపించకుండా ఉన్న అందమైన ఫోటోలను షేర్ చేస్తూ.. ఫ్యాన్స్కు ఛాలెంజ్లు విసురుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా యాంకర్ అనసూయ కూడా తన లేటెస్ట్ ఫోటోను ఒకటి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో అనసూయ లైబ్రరీలో నిలబడి ఓ పుస్తకాన్ని మొహానికి అడ్డుగా పెట్టుకొని సీరియస్గా చదువుతూ కనిపించింది. అయితే తన మొహాన్ని మాత్రం కనిపించకుండా చూసుకుందీ బ్యూటీ. ఇక ఈ ఫోటోతో పాటు.. పాలో కొయెల్హో రచయిత రాసిన.. ‘పుస్తకం అనేది పాఠకుల మదిలో నడిచే సినిమాలాంటిది’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్ను జోడించారు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్ వైరల్గా మారింది. ఆమె అభిమానులు ఫోటోపై లైక్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక అనసూయ కెరీర్ విషయానికొస్తే.. ఆమె ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప చిత్రంలో ద్రాక్షాయని అనే పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే చిత్ర యూనిట్ ఆమె ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ ఫోటోకు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.
Also Read: Viral Video: చెప్పుతో మొసలికి చుక్కలు చూపించిన యువతి !! దెబ్బకు పరార్ !! వీడియో
Health Tips: ఇంట్లో ఉండే మహిళలకు ఈ 4 యోగాసనాలు.. శరీరానికి అద్భుత ప్రయోజనాలు..