Samantha: నాగచైతన్యతో విడాకుల వ్యవహారం తర్వాత సమంత సినిమాల వేగాన్ని ఓ రేంజ్లో పెంచేసింది. అంతకుముందు ఆచితూచి సినిమాలు చేసిన సామ్, ఇప్పుడు వరుస సినిమాలను క్యూలో పెడుతోంది. ఇప్పటికే తెలుగుతో పాటు, హిందీలో పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ చిన్నది తాజాగా మరో సినిమాను మొదలు పెట్టింది. శ్రీదేవీ మూవీస్ ప్రొడక్షన్స్లో సమంత ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. సోమవారం పూజా కార్యక్రమాలతో చిత్రీకరణను హైదరాబాద్లో మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ‘యశోద’ అనే టైటిల్ను ఖరారు చేశారు.
ఇక సమంత కెరీర్లో తొలి పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమా నిలవనుందని చెప్పాలి. నిజానికి సమంత ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్-2తో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించినప్పటికీ అది వెబ్ సిరీస్ అనే విషయం తెలిసిందే. దీంతో యశోదనే సమంత తొలి పాన్ ఇండియా చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లేడి ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ‘సమంత ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమిది. సమంత ప్రధాన పాత్రలో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. థ్రిల్లర్ జానర్లో నేషనల్ లెవల్లో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నాము. సమంత క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్కు తగ్గ కథ ఇది’ అంటూ చెప్పుకొచ్చారు. మరి ఈ పాన్ ఇండియా చిత్రంతో సమంత రేంజ్ ఏ స్థాయిలో పెరుగుతుందో చూడాలి.
Twitter Audio: ఇకపై ట్వీట్లను చదవడమే కాదు, వినొచ్చు కూడా.. సరికొత్త ఫీచర్ తీసుకొస్తున్న ట్విట్టర్..