పదో తరగతి పరీక్షలు ఎన్నిసార్లు రద్దయ్యాయంటే..!
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం సాధ్యమైన పని కాదు కాబట్టి పైతరగతులకు ప్రమోట్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసైన్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరిగణలోకి తీసుకొని పదో తరగతి విద్యార్థులను పైతరగతికి ప్రమోట్ చేయాలని ఆయన అన్నారు. కాగా తెలంగాణలో పదో తరగతి […]
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం సాధ్యమైన పని కాదు కాబట్టి పైతరగతులకు ప్రమోట్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసైన్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరిగణలోకి తీసుకొని పదో తరగతి విద్యార్థులను పైతరగతికి ప్రమోట్ చేయాలని ఆయన అన్నారు. కాగా తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడటం ఇది తొలిసారేం కాదు.
నిజాం పాలనలో 1951-52 కాలంలో జరిగిన ముల్కీ(స్థానికులకే ఉద్యోగాలు)ఉద్యమ సమయంలో స్కూళ్లను 4 నెలల పాటు మూసేశారు. ఈ నేపథ్యంలో పరీక్షలను రద్దు చేసి అందరినీ ప్రమోట్ చేశారు. అలాగే 1969లో తెలంగాణ ఉద్యమ సమయంలో పరీక్షలపై సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో నామ మాత్రంగా పరీక్షలు నిర్వహించి అందరినీ పాస్ చేశారు. ఇక ఇప్పుడు కరోనా నేపథ్యంలో మరోసారి తెలంగాణలో పరీక్షలు రద్దయ్యాయి. ఇదిలా ఉంటే ఇదివరకే రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు అన్ని క్లాసుల వారిని పరీక్షలు లేకుండానే తర్వాత తరగతికి ప్రమోట్ చేశారు.
Read This Story Also: రిజెక్ట్ చేసిన బాలయ్య.. ఓకే చెప్పిన గోపిచంద్..!