లాక్డౌన్ సమయంలో కలకలం.. శిశువును చేతిసంచిలో పట్టుకెళ్తున్న తండ్రి
లాక్డౌన్ సమయంలో.. ఏడు రోజుల శిశువును చేతి సంచిలో ఓ వ్యక్తి పట్టుకెళ్తుండటం కలకలం రేపుతోంది. ఈ ఘటన నక్కపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా దొడవాక నుంచి విశాఖ జిల్లాకు పసికందుని తీసుకొచ్చాడు పాప తండ్రి రాజు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పారిపోతుండగా పాయకరావు పేట వద్ద రాజును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పొంతనలేని సమాధానం ఇవ్వడంతో తండ్రి రాజు నుంచి.. పసికందును స్వాధీనం చేసుకుని, దొండవాక తల్లి […]
లాక్డౌన్ సమయంలో.. ఏడు రోజుల శిశువును చేతి సంచిలో ఓ వ్యక్తి పట్టుకెళ్తుండటం కలకలం రేపుతోంది. ఈ ఘటన నక్కపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా దొడవాక నుంచి విశాఖ జిల్లాకు పసికందుని తీసుకొచ్చాడు పాప తండ్రి రాజు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పారిపోతుండగా పాయకరావు పేట వద్ద రాజును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పొంతనలేని సమాధానం ఇవ్వడంతో తండ్రి రాజు నుంచి.. పసికందును స్వాధీనం చేసుకుని, దొండవాక తల్లి దగ్గరకు తీసుకెళ్లారు. అయితే పాపను తీసుకెళ్లిన విషయం తనకు తెలీదని.. ఏం చేయడానికి తీసుకెళ్లాడోనని ఆందోళన చెందింది తల్లి. పసికందును తల్లికి అప్పజెప్పిన పోలీసులు.. తండ్రి రాజును అదుపులోకి తీసుకెళ్లారు.
ఇవి కూడా చదవండి:
జబర్దస్త్ నుంచి వాళ్లిద్దరినీ తప్పించనున్న మల్లెమాల టీం?
ఫేస్బుక్ వ్యసనానికి.. ఫేస్బుక్కే మందు కనిపెట్టింది
లాక్ డౌన్పై మనసులో మాట బయటపెట్టిన జగన్..!
హిందూ మహాసముద్రంలో వింత ఆకారం.. మెరుపు తిగలాంటి
బ్రేకింగ్: జగన్ జెడ్ స్పీడ్.. ఏపీ కొత్త ఎన్నికల కమీషనర్ నియామకం
మహిళల కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్.. గృహ హింస ఎదుర్కొంటే..