సీఎం క్యాంప్ ఆఫీసు ముందు ధర్నా చేస్తామన్న ఎమ్మెల్యే… ఆ పనిని అడ్డుకోవాలని డిమాండ్…
తెలంగాణలో గోహత్యలు జరుగుతున్నా సీఎం పట్టించుకోవడం లేదని, ఓల్డ్ సిటీ లో అక్రమంగా గోవధ శాలలు నడుస్తున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు.
తెలంగాణలో గోహత్యలు జరుగుతున్నా సీఎం పట్టించుకోవడం లేదని, ఓల్డ్ సిటీ లో అక్రమంగా గోవధ శాలలు నడుస్తున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. కట్టర్ హిందు అని చెప్పుకునే సీఎం రాజ్యంలో గోహత్యలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. గో హత్యలను ప్రభుత్వం అడ్డుకోకపోతే భజరంగ్దళ్, హిందువులు కలిసి అడ్డుకుంటారని అన్నారు. గోవుల తరలింపుపై ప్రభుత్వం స్పందించకుంటే సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదుట గోవులను తీసుకెళ్లి ధర్నా చేస్తామని హెచ్చరించారు.
Rescued 33 cows and calves being taken for slaughter and handed it over at choutuppal police station. pic.twitter.com/ASLqJChBkC
— Raja Singh (@TigerRajaSingh) December 15, 2020
కాగా, ఖమ్మం నుంచి 33 ఆవు దూడలను అక్రమంగా హైదరాబాద్కు తరలిస్తుండగా ఎమ్మెల్యే రాజసింగ్ చౌటుప్పల్ వద్ద పట్టుకున్నారు. నిందితులను స్థానిక పోలీసులకు అప్పగించారు. చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆవు దూడలను జియగూడాలోని గోశాలకు తరలించారు.