‘రాజ‌మౌళికి క‌రోనా’.. స‌ల‌హా ఇచ్చిన ఆర్జీవీ..

| Edited By:

Jul 30, 2020 | 9:05 PM

ద‌ర్మ‌క‌ధీరుడు రాజ‌మౌళికి, అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకిన విష‌యం.. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. 'తన కుటుంబ సభ్యులకు కరోనా లక్షణాలు ఉన్నాయని..

రాజ‌మౌళికి క‌రోనా.. స‌ల‌హా ఇచ్చిన ఆర్జీవీ..
Follow us on

ద‌ర్మ‌క‌ధీరుడు రాజ‌మౌళికి, అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకిన విష‌యం.. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. ‘తన కుటుంబ సభ్యులకు కరోనా లక్షణాలు ఉన్నాయని, టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలిందని, త్వరగా కోలుకొని ప్లాస్మా దానం చేయాలనుకుంటున్నామని’ రాజమౌళి బుధవారం ట్వీట్ చేశారు. ఇక ఈ విషయం తెలిసిన‌ పలువురు సెలబ్రిటీలు మొదలు.. ఆయ‌న ఫ్యాన్స్ కూడా ”త్వరగా కోలుకోండి. టేక్‌ కేర్‌ సర్‌” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

ఇక అలాగే ఎవ‌రిపైనైనా త‌న‌దైన స్టైల్లో స్పందించే వ‌ర్మ‌.. రాజ‌మౌళికి క‌రోనా సోకిన విష‌యంపై కూడా ట్విట్ట‌ర్ వేదిక‌గా జోకులు వేశారు. ‘రాజమౌళి స‌ర్‌.. మీ సైనికుడు బాహుబ‌లిని పిలిచి క‌రోనాను ఓ త‌న్ను త‌న్న‌మ‌నండి అంటూ వ‌ర్మ జ‌క్క‌న్న‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. అయితే ఈ జోకులు ఎలా ఉన్నా.. మీరు మీ కుటుంబ స‌భ్యులు త్వ‌ర‌గా క‌రోనా బారి నుంచి కోలుకోవాలి కోరుకుంటున్నా అంటూ రాజమౌళికి’ ధైర్యం చెప్పారు వ‌ర్మ‌.

Read More: 

క‌రోనా టెర్ర‌ర్ః ప్ర‌పంచ వ్యాప్తంగా కోటి 70 ల‌క్ష‌ల‌కు చేరుకున్న కోవిడ్ కేసులు..

తెలంగాణ జైళ్ల శాఖ‌లో క‌రోనా క‌ల‌కలం.. ఏకంగా 18 కేసులు..