రైతులకు మేలు చేకూరే విధంగా.. ఏపీలో భారీ కార్యక్రమం..

| Edited By:

May 18, 2020 | 12:08 PM

రైతులకు మేలు చేకూరే విధంగా ఏపీ ప్రభుత్వం మరో భారీ కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే కరోనా కాలంలో ఎన్నో పనులు చేస్తూ తమ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తున్న ఉద్యోగులకు మరో భారీ కార్యక్రమం..

రైతులకు మేలు చేకూరే విధంగా.. ఏపీలో భారీ కార్యక్రమం..
Follow us on

రైతులకు మేలు చేకూరే విధంగా ఏపీ ప్రభుత్వం మరో భారీ కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే కరోనా కాలంలో ఎన్నో పనులు చేస్తూ తమ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తున్న ఉద్యోగులకు మరో భారీ కార్యక్రమం లిస్టులో చేరింది. అదేంటంటే.. ఖరీఫ్ విత్తనాల పంపిణీ. ఇదివరకు రైతులు స్వయంగా వెళ్లి విత్తనాలు కొనుక్కునే వారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం స్వయంగానే ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఇవాళ్టి నుంచి గ్రామ సచివాలయాల్లో విత్తనాల పంపిణీ జరగనుంది.

ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని పనులూ సిద్ధం చేసింది ప్రభుత్వం. మొత్తం 8 లక్షల క్వింటాళ్లకు పైగా విత్తనాల్ని.. ఇ-క్రాప్ ఆధారంగా రైతులకు అందజేయనుంది. ఈ మేరకు ఖరీఫ్ పంటకు 5,07,599 క్వింటాళ్ల వేరుశనగ, 2,28,732 క్వింటాళ్ల వరి, 88,215 క్వింటాళ్ల జీలుగ, జనుము, పిల్లి పెసర వంటి పచ్చి రొట్ట విత్తనాల్ని ప్రభుత్వం రెడీ చేసింది. వేరుశనగ విత్తనాలపై 40 శాతంతో పాటు దాదాపు 13 రకాల వరి వంగడాలపై క్వింటాలుకు రూ.500 సబ్సీడీ ఇస్తోంది.

గ్రామ సచివాలయాల దగ్గర విత్తనాల ధరల పట్టిక ఉంటుంది. కాబట్టి రైతులు ముఖాలకు మాస్కులు, చేతులకు శానిటైజర్ రాసుకుని వెళ్లి.. విత్తనాల్ని తెచ్చుకోవడమే. కాగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జాతీయ ఆహార భద్రతా మిషన్ కింద.. వరి వంగడాలపై సబ్సీడీ రెట్టింపుగా ఇస్తున్నారు. కాగా నకిలీ విత్తనాలతో పంట వేసి.. నష్టపోయే రైతులకు ఈ సారి ప్రభుత్వమే స్వయంగా విత్తనాల్ని పంపిణీ చేసింది కాబట్టి.. అవి నకిలీవి కావనే భరోసా రైతుల్లో ఉంటుంది.

Read More: 

రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు.. ఈ రోజు తేలనుంది

గుడ్‌న్యూస్.. వారికి 3 నెలలు గ్యాస్ సిలిండర్ ఉచితం