ఏపీ హైకోర్టుకు కొత్త జడ్జీలు..

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ ఎం. వెంకటరమణ నియమితులయ్యారు. ఈ మేరకు వీరి నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఆమోదముద్ర వేశారు. అనంతరం వీరిని ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తులుగా నియమించినట్లు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసును రాష్ట్రపతి ఆమోదించారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వ సంయుక్త కార్యదర్శి రాజిందర్‌ కశ్యప్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీ హైకోర్టుకు కొత్త జడ్జీలు..
Follow us

| Edited By:

Updated on: Jun 13, 2019 | 9:51 AM

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ ఎం. వెంకటరమణ నియమితులయ్యారు. ఈ మేరకు వీరి నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఆమోదముద్ర వేశారు. అనంతరం వీరిని ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తులుగా నియమించినట్లు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసును రాష్ట్రపతి ఆమోదించారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వ సంయుక్త కార్యదర్శి రాజిందర్‌ కశ్యప్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.