ఇటీవల కాలంలో భారత మార్కెట్లో సేల్స్ సంబంధిత జాబ్స్కు అధిక డిమాండ్ ఉన్నాయి. అయితే భారతదేశంలోని 61 శాతం సేల్స్ ప్రొఫెషనల్స్ రాబోయే 3-24 నెలల్లో ఉద్యోగాలను మార్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆటోమోటివ్, రిటైల్ రంగాల నుంచి ఎక్కువ మంది ఉద్యోగాలను విడిచిపెట్టాలని భావిస్తున్నారు. 93 శాతం సేల్స్ ప్రొఫెషనల్స్ తమ సూపర్వైజర్లు తమ సవాళ్లను అర్థం చేసుకోలేదని లేదా సమర్థవంతమైన మద్దతును అందించలేదని భావిస్తున్నారని ఇటీవల ఓ నివేదికలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో సేల్స్ ప్రొఫెషనల్స్పై రిలీజైన తాజా నివేదిక మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఆటోమోటివ్, ఫార్మాస్యూటికల్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలలో 83 శాతం మంది అధిక ఒత్తిడిని అనుభవిస్తున్నారని ఓ నివేదికలో పేర్కొన్నారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒత్తిడి అనేద సీనియారిటీ ఆధారంగా పెరుగుతుందని వివరిస్తున్నారు. పోటీ మార్కెట్ పరిస్థితులు, అధిక నిర్వహణ అంచనాలు వారి ఒత్తిడి స్థాయిలకు గణనీయంగా పెంచుతున్నాయి. శిక్షణా కార్యక్రమాల ప్రభావం, సేల్స్ నిపుణుల కోసం ప్రేరణ కలిగించే అంశాలు, అమ్మకాల్లో మహిళలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లను నివేదిక మరింతగా విశ్లేషించింది. నిర్మాణాత్మక, దీర్ఘ-కాల శిక్షణా కార్యక్రమాల అవసరాన్ని, వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాల ద్వారా అత్యుత్తమ పనితీరును గుర్తించాలని ఆ నివేదిక పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..