పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. కొవిడ్ వ్యాక్సిన్ పై సానుకూల వార్తల నేపథ్యంలోలాభాల బాట..

దేశీయ మార్కెట్లు ఈ వారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అటు వ్యాక్సిన్ పై సానుకూల వార్తలు సూచీలను ప్రభావితం చేస్తున్నాయి.

పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. కొవిడ్ వ్యాక్సిన్ పై సానుకూల వార్తల నేపథ్యంలోలాభాల బాట..
stock market
Follow us

|

Updated on: Dec 07, 2020 | 10:20 AM

Mumbai: దేశీయ మార్కెట్లు ఈ వారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9.37 గంటలకు సెన్సెక్స్ 123 పాయింట్లు లాభపడి 45, 210 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 41 పాయింట్ల లాభంతో 13,300 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.74 వద్ద కొనసాగుతుంది.

గతవారం ఇటు దేశీయ సూచీలతోపాటు ఆసియా మార్కెట్లు రికార్డు స్థాయిలను నమోదు చేశాయి. ఆసియా మార్కెట్లు కాస్త నెమ్మదించినా లాభాల సరళిని కొనసాగిస్తున్నాయి. అటు వ్యాక్సిన్ పై సానుకూల వార్తలు సూచీలను ప్రభావితం చేస్తున్నాయి. అటు ఓఎన్‏జీసీ, అదానీ పోర్ట్స్, భారత్ పెట్రోలియం, గెయిల్, యూపీఎల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. హెచ్‏డీఎఫ్‏సీ బ్యాంక్, టైటాన్ కంపెనీ, దివీస్ ల్యాబ్, హిందాల్కో ఇండస్ట్రీస్, కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాల బాట పట్టాయి.