Inflation: రుతుపవనాల రాక, వడ్డీ రేట్ల పెంపు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..

|

Jun 20, 2022 | 7:24 AM

రుతుపవనాల ఆగమనం వ్యవసాయ ఉత్పత్తి పెంచవచ్చనే అంచనా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడం వల్ల అధిక ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం పొందవచ్చని ఆర్థికవేత్తలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు...

Inflation: రుతుపవనాల రాక, వడ్డీ రేట్ల పెంపు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..
Inflation
Follow us on

రుతుపవనాల ఆగమనం వ్యవసాయ ఉత్పత్తి పెంచవచ్చనే అంచనా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడం వల్ల అధిక ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం పొందవచ్చని ఆర్థికవేత్తలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆహార పదార్థాలు, ఇంధనం ధరల కారణంగా ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిలో ఉంది. పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని మరింత తగ్గించడం వంటి ఆర్థిక చర్యలతో ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని కూడా నియంత్రించగలిగినప్పటికీ, ధరల నియంత్రణకు ద్రవ్య విధానానికి ప్రాధాన్యత ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది ప్రాతిపదికన 7.04 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో ఈ సంఖ్య 7.79 శాతంగా ఉంది. మరోవైపు మే నెలలో టోకు ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 15.88 శాతానికి ఎగబాకింది. ధరల పెరుగుదలలో నాల్గో వంతు ఆహార పదార్థాల నుండి వస్తోంది. సాధారణ రుతుపవనాల వల్ల ఉపశమనం పొందవచ్చని భావిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే కీలకమైన పాలసీ రేటు రెపోను 0.90 శాతం పెంచిందని, రానున్న కాలంలో ఇది 0.80 శాతం పెరగవచ్చని ఆయన అన్నారు.

ప్రముఖ కంపెనీలు ఇప్పటికే ఎడిబుల్ ఆయిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ద్రవ్యోల్బణం పెరగడానికి గ్లోబల్ కమోడిటీ ధరలు ప్రధాన చోదక కారకంగా ఉన్నాయని ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ ఎకనామిస్ట్ విశ్రుత్ రాణా అన్నారు. ఇంకా ఆహార ధరలు రుతుపవనాలపై ఆధారపడి ఉంటాయి. మెరుగైన రుతుపవనాలు వ్యవసాయ ఉత్పత్తిని పెంచుతాయి. ధరలను అదుపులో ఉంచుతాయి. తక్కువ ఎక్సైజ్ సుంకం, తక్కువ విలువ ఆధారిత పన్ను లేదా వ్యవసాయ ఉత్పత్తులపై ప్రత్యక్ష సబ్సిడీ వంటి కొన్ని అదనపు పాలసీ ఎంపికలు ఉన్నాయని రాణా చెప్పారు. అయితే ప్రస్తుతానికి ద్రవ్య విధానానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. పాలసీ రేట్లను 0.75 శాతం పెంచాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు. భారత్‌ రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ చీఫ్‌ ఎకనామిస్ట్‌ సునీల్‌ సిన్హా మాట్లాడుతూ.. నికర వస్తువుల దిగుమతిదారుగా భారత్‌ ఈ విషయంలో పెద్దగా ఏమీ చేయలేదని అన్నారు. అయితే, ప్రభావాన్ని తగ్గించేందుకు దిగుమతి సుంకాన్ని తగ్గించవచ్చు.