Credit Card Rules: క్రెడిట్ కార్డుల ఖాతాదారులకు అలెర్ట్.. అమల్లోకి నయా రూల్స్..!

|

Jul 04, 2024 | 3:33 PM

జూలై 1 నుంచి హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకుల క్రెడిట్ కార్డులు ఉన్న కస్టమర్‌లు ఇకపై తమ క్రెడిట్ కార్డ్ బిల్లులను సెటిల్ చేయడానికి థర్డ్ పార్టీ యాప్స్‌ను ఉపయోగించలేరు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌తో ఈ యాప్‌ల అనుసంధానం లేకపోవడం వల్ల ఆర్‌బీఐ ఈ తాజా నియమాలను అమల్లోకి తీసుకొచ్చింది.

Credit Card Rules: క్రెడిట్ కార్డుల ఖాతాదారులకు అలెర్ట్.. అమల్లోకి నయా రూల్స్..!
భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభమైంది. నేడు దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. దీంతో దేశంలో పండుగలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు దసరా, దీపావళి, ఛత్ వంటి అనేక పండుగలు రాబోయే కొద్ది రోజుల్లో జరుపుకోనున్నాయి. పండుగల సమయంలో ప్రజలు చాలా షాపింగ్ చేస్తారు. దీని కోసం చాలా మంది క్రెడిట్‌ కార్డులను ఉపయోగించి షాపింగ్‌ చేస్తుంటారు.
Follow us on

2024లో ఇప్పటికే రెండు త్రైమాసికాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో క్రెడిట్ కార్డుల చెల్లింపు విషయంలో జూలై 1 నుంచి కీలక నిబంధనలు అమల్లోకి వచ్చాయి. జూలై 1 నుంచి హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకుల క్రెడిట్ కార్డులు ఉన్న కస్టమర్‌లు ఇకపై తమ క్రెడిట్ కార్డ్ బిల్లులను సెటిల్ చేయడానికి థర్డ్ పార్టీ యాప్స్‌ను ఉపయోగించలేరు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌తో ఈ యాప్‌ల అనుసంధానం లేకపోవడం వల్ల ఆర్‌బీఐ ఈ తాజా నియమాలను అమల్లోకి తీసుకొచ్చింది. కస్టమర్‌లు తమ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా లేదా నేరుగా బ్యాంకుల సొంత ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చేయాల్సి ఉంటుంది. కాట్టి ఆర్‌బీఐ తాజా నిర్ణయం మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

జూలై 1, 2024 నుంచి అన్ని క్రెడిట్ కార్డ్ చెల్లింపులను భారత్ బిల్ పే సిస్టమ్ ద్వారా మళ్లించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. ఇది భారతదేశంలో ప్రాసెస్ చేసిన క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. క్రెడ్, ఫోన్ పే, బిల్‌డెస్క్ వంటి ఫిన్‌టెక్ వ్యాపారాలు ఈ నిర్ణయంగా గణనీయంగా పడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 20 మిలియన్ క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, 14 మిలియన్లను కలిగి ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఇంకా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌ని ప్రారంభించలేదు. అందువల్లక్రెడ్, ఫోన్ పే వంటి నాన్-కంప్లైంట్ రుణదాతలు ఇకపై వారికి లేదా ఏదైనా ఇతర బీబీపీఎస్ సభ్యుల ప్లాట్‌ఫారమ్‌కు కార్డ్ బకాయిలను నిర్వహించడానికి అనుమతి ఉండదు. లావాదేవీ వాల్యూమ్‌లలో గణనీయమైన క్షీణత గురించి ఫిన్‌టెక్‌లు ఆందోళన చెందుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. 

అయితే క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు వారి నెలవారీ బిల్లులను చెల్లించడానికి మూడు ఎంపికలు ఉన్నాయి. ఆటో-డెబిట్, నెట్‌బ్యాంకింగ్, థర్డ్ పార్టీ అప్లికేషన్లు. థర్డ్ పార్టీ దరఖాస్తు ప్రక్రియ జూన్ 30న ముగుస్తుంది. ఈ సమయంలో మొదటి రెండు ఆపరేషన్ మోడ్‌లు కొనసాగుతాయి. జూలై 3, 2024 నాటి బీబీపీఎస్ వెబ్‌సైట్ ప్రకారం కేటగిరీ క్రెడిట్ కార్డ్ కింద భారత్ బిల్ చెల్లింపులపై ప్రత్యక్షంగా ఉన్న బ్యాంకులుగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సరస్వత్ బ్యాంక్ ఉన్నాయి. కానీ యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యస్ బ్యాంక్ ఇంకా బీబీపీఎస్‌ను ప్రారంభించలేదు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..