డబుల్ ధమాకా… బండి సంజయ్కు కేంద్రం మరో కీలక పదవి
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్లో ఉన్నారు. ఇటీవలే ఆయన్ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది అధిష్టానం. త్వరలోనే ఆయన ఈ బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ పదవిని స్వీకరించకముందే కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్కు మరో పదవిని కన్ఫామ్ చేసింది. భారత్లోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సంస్థల్లో ఒకటైన ఎయిమ్స్( ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) కు ఉన్న […]
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్లో ఉన్నారు. ఇటీవలే ఆయన్ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది అధిష్టానం. త్వరలోనే ఆయన ఈ బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ పదవిని స్వీకరించకముందే కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్కు మరో పదవిని కన్ఫామ్ చేసింది.
భారత్లోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సంస్థల్లో ఒకటైన ఎయిమ్స్( ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) కు ఉన్న 8 కళాశాలలకు బోర్డు మెంబర్లను నియమించింది కేంద్ర ప్రభుత్వం. వీటిలో తెలంగాణలో ఉన్న బీబీనగర్ ఎయిమ్స్కు బండి సంజయ్ బోర్డు మెంబర్గా నియమితులయ్యారు. ఈ మేరకు సర్కారు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఎంపీ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. కాగా ఆదివారం దేశ రాజధాని ఢిల్లీ నుంచి సంజయ్ హైదరాబాద్ రానున్నారు. విమానాశ్రయం నుంచి పార్టీ ఆఫీస్కి వెళ్లి..మీట్ అండ్ గ్రీట్ ప్రొగ్రామ్లో పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.