ఇంట్లోనే కరోనా పరీక్షలు.. మహమ్మారిపై మరో ముందడుగు..
కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. అయితే.. కరోనా సోకిందో లేదోననే విషయాన్ని ఇంట్లోనే ఉండి... నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు. అందుకోసం ప్రత్యేక పరీక్ష
కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. అయితే.. కరోనా సోకిందో లేదోననే విషయాన్ని ఇంట్లోనే ఉండి… నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు. అందుకోసం ప్రత్యేక పరీక్ష కిట్లను బయోనె అనే సంస్థ ఆవిష్కరించింది. వీటితో నిర్వహించే పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలు వస్తాయని, ఈ కిట్లకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఆమోదం లభించిందని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు.
కాగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వామ్య సంస్థల సహకారంతో ఈ సరికొత్త పరీక్ష కిట్లను రూపొందించినట్లు, నాణ్యత పరమైన కఠిన పరిశీలనల తర్వాత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే బయోనె సంస్థ జన్యు, సూక్ష్మజీవుల పరిణామాలకు సంబంధించి పలు పరీక్షలను, పరిశోధనలను సాగిస్తోంది.