బ్రేకింగ్ : ఏపీ ప్రభుత్వ విప్లుగా మరో ముగ్గురు..!
ఏపీ ప్రభుత్వ విప్లుగా మరో ముగ్గురికి అవకాశం దక్కింది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలను విప్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మొత్తం ఇప్పుడు ఎనిమిది మంది ప్రభుత్వ విప్లుగా వ్యవహరించనున్నారు. మంత్రివర్గం కూర్పులో అవకాశం దక్కని వారు అసంతృప్తికి గురికాకుండా ఉండేందుకు ఇప్పటికే ఐదుగురిని సీఎం జగన్ ప్రభుత్వ విప్లుగా నియమించిన విషయం తెలిసిందే. వారు.. రాయచోటి ఎమ్మెల్యే గడిచోట శ్రీకాంత్ […]
ఏపీ ప్రభుత్వ విప్లుగా మరో ముగ్గురికి అవకాశం దక్కింది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలను విప్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మొత్తం ఇప్పుడు ఎనిమిది మంది ప్రభుత్వ విప్లుగా వ్యవహరించనున్నారు. మంత్రివర్గం కూర్పులో అవకాశం దక్కని వారు అసంతృప్తికి గురికాకుండా ఉండేందుకు ఇప్పటికే ఐదుగురిని సీఎం జగన్ ప్రభుత్వ విప్లుగా నియమించిన విషయం తెలిసిందే. వారు.. రాయచోటి ఎమ్మెల్యే గడిచోట శ్రీకాంత్ రెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడులను విప్లుగా జగన్ నియమించారు.