YS Jagan: ఎమ్మెల్సీ గెలుపు కోసం జగన్‌ వ్యూహాలు.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరస భేటీ!

| Edited By: Balaraju Goud

Aug 08, 2024 | 4:51 PM

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గెలుపు కోసం జగన్‌ వ్యూహాలు రచిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

YS Jagan: ఎమ్మెల్సీ గెలుపు కోసం జగన్‌ వ్యూహాలు.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరస భేటీ!
Ys Jagan On Mlc Election
Follow us on

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గెలుపు కోసం జగన్‌ వ్యూహాలు రచిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులతో జగన్ నేరుగా మాట్లాడారు. వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ గెలుపే లక్ష్యంగా ప్రజాప్రతినిధులకు దిశినిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలో ఎలా వ్యవహరించాలో సూచనలు ఇచ్చారు జగన్‌.

ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నేతల్లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. రెండు రోజుల పాటు వైఎస్ జగన్ ను కలిసిన వారిలో ఉత్సాహం మరింత రెట్టింపు అవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే జీవీఎంసీ కార్పొరేటర్లతో సమావేశమైన వైఎస్ జగన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

ఆగస్ట్ 30వ తేదీన ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీలు జడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. ఎంపీటీసీ, జడ్పిటీసీ, కౌన్సిలర్లతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. దీంతో వారిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తమ అభిమాన నేతను ప్రత్యక్షంగా కలుస్తుండడంతో సభ్యులలో ఎన్నడూ లేని విధంగా నూతన ఉత్సాహం వెళ్ళు విరుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీ పరంగా ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై వారితో చర్చించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి సంపూర్ణ బలం ఉంది. నాలుగింట 3 వంతులకు పైగా సభ్యుల బలం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో 97 మంది కార్పొరేటర్లు, 36 మంది జడ్పీటీసీలు, 636 మంది ఎంపీటీసీలు, 53 మంది కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. చనిపోయిన వారితో ఏర్పడిన ఖాళీలు 11 ఉన్నాయి. సాధారణ ఎన్నికల తరువాత జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో ప్రతి ఒక్కరిలోనూ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంపై ఆసక్తి నెలకొంది. మొత్తం 833 సభ్యుల్లో వైయస్సార్సీపీకి 620 మంది వరకు సభ్యుల బలం ఉంది. కూటమికి కేవలం 200 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికలో సునాయాసంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..