Andhra Pradesh: అయ్యో.. ఎంత పనైందమ్మా.. బాటిల్ చూసి మంచినీళ్లనుకుంది.. కానీ, చివరకు..

|

Jan 25, 2023 | 8:28 AM

బాటిల్ ను చూసి పాపం.. ఆ మహిళ మంచినీళ్లు అనుకుంది.. కానీ.. అది ప్రాణం తీసే యాసిడ్ అని గమనించలేకపోయింది. బాటిల్ మూత తీసి తాగింది.. అనంతరం పేగులు కాలి మండిపోవడంతో విలవిలలాడింది.

Andhra Pradesh: అయ్యో.. ఎంత పనైందమ్మా.. బాటిల్ చూసి మంచినీళ్లనుకుంది.. కానీ, చివరకు..
Water Bottle
Follow us on

బాటిల్ ను చూసి పాపం.. ఆ మహిళ మంచినీళ్లు అనుకుంది.. కానీ.. అది ప్రాణం తీసే యాసిడ్ అని గమనించలేకపోయింది. బాటిల్ మూత తీసి తాగింది.. అనంతరం పేగులు కాలి మండిపోవడంతో విలవిలలాడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు ప్రాణాలు విడిచింది. మంచి నీళ్లు అనుకుని యాసిడ్‌ తాగిన మహిళ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. విజయవాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంబాడీపేట అంబటి సముద్రాలవీధిలో గురవమ్మ (50) కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది. మంగళవారం ఉదయం ఇంటి వరండాలో ఉన్న టేబుల్‌పై వాటర్‌ బాటిల్‌ ఉంది. అయితే, దానిలో యాసిడ్‌ ఉండటాన్ని ఆమె గ్రహించలేకపోయింది.

ఆ బాటిల్ లో ఉన్నవి మంచినీళ్లు అనుకుని పొరపాటున తాగింది. వెంటనే నోరు మంటతో పాటు పెదవులపై బొబ్బలు వచ్చాయి.. వెంటనే వాంతులు చేసుకుని కుప్పకూలింది. గమనించిన కొడుకు, కోడలు గురవమ్మను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి గురవమ్మ మృతి చెందింది.

యాసిడ్ తాగటంతో ఆస్పత్రికి చేరేలోపే పేగులు పూర్తిగా కాలిపోయాయని వైద్యులు తెలిపారు. లోపలి అవయవాలన్నీ కాలిపోవడంతో చికిత్స పొందుతూ మరణించిందని వెల్లడించారు. మృతురాలి కొడుకు శివకృష్ణ ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..