ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా.. దానివల్ల ప్రయోజనం ఏంటి.. పూర్తి వివరాలు..

|

Jun 07, 2024 | 1:00 PM

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మెజారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ జూన్ 9న సాయంత్రం 6గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ, ఎన్డీయేలోని భాగస్వామ్య పార్టీల ఎంపీలు ఆయనను లోక్‌సభలో తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. దీనికి ముందు కూడా ఎన్డీయేలోని భాగస్వామ్య పార్టీలు తమ డిమాండ్లను ప్రధాని మోదీ ముందు ఉంచాయి. ఎన్డీయేలోని రెండు ప్రధాన పార్టీలు తమ తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలనే నినాదాన్ని తెరపైకి తెచ్చాయి.

ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా.. దానివల్ల ప్రయోజనం ఏంటి.. పూర్తి వివరాలు..
Ap Special Status
Follow us on

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మెజారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ జూన్ 9న సాయంత్రం 6గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ, ఎన్డీయేలోని భాగస్వామ్య పార్టీల ఎంపీలు ఆయనను లోక్‌సభలో తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. దీనికి ముందు కూడా ఎన్డీయేలోని భాగస్వామ్య పార్టీలు తమ డిమాండ్లను ప్రధాని మోదీ ముందు ఉంచాయి. ఎన్డీయేలోని రెండు ప్రధాన పార్టీలు తమ తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలనే నినాదాన్ని తెరపైకి తెచ్చాయి. బీహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని రాష్ట్ర మంత్రి.. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడు, జేడీయూ నేత విజయ్ చౌదరి డిమాండ్ చేశారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ కోసం ఇదే డిమాండ్ చేస్తున్నారు. అయితే గతంలో జరిగిన కొన్ని రాజకీయ సమీకరణాల దృష్ట్యా, కేంద్రంలో తమకు సరిపడా బలంలేని నేపథ్యంలో ప్రత్యేకహోదా అంశాన్ని చాలా మంది నేతలు పక్కనపెట్టేశారు. అయితే తాజాగా వచ్చిన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టాలంటే ఏపీ నుంచి పార్లమెంటుకు ఎంపికైన అభ్యర్థుల మద్దతు తప్పనిసరి. దీంతో ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇంతకూ ఈ ప్రత్యేక రాష్ట్ర హోదా, ప్రత్యేక ప్యాకేజీ అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, అది వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఏం లాభం? ఎంతటి ప్రయోజనం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రత్యేక హోదా అంటే..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో రెండవసారి అధికారంలో ఉన్న సమయంలో, NDA ప్రభుత్వం జమ్మూ, కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 లోని కొన్ని నిబంధనలను రద్దు చేసింది. ఈ నిబంధనల ద్వారా రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక అధికారాలు లభించాయి. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 ఉంది. ఈ ఆర్టికల్ ద్వారా ఏ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు జరిగితే, ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినట్లే అని చెబుతుంది. 1969లో తొలిసారిగా ఐదవ ఆర్థిక సంఘం గాడ్గిల్ ఫార్ములా ఆధారంగా మూడు రాష్ట్రాలకు జమ్మూ-కశ్మీర్, అస్సాం, నాగాలాండ్‌లకు ప్రత్యేక హోదా కల్పించింది. ఈ మూడు రాష్ట్రాల సామాజిక, ఆర్థిక, భౌగోళిక వెనుకబాటు ఆధారంగా ఏర్పాటు చేశారు. ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వడం వల్ల ఆయా రాష్ట్రాల వెనుకబాటుతనాన్ని అధిగమించి అభివృద్ది చెందిన రాష్ట్రంగా ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఇది కాకుండా, రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి జాతీయ అభివృద్ధి మండలి కొన్ని ప్రమాణాలను కూడా రూపొందించింది. వీటిలో ఒక రాష్ట్రానికి ఉన్న వనరులు ఏమిటి, అక్కడి తలసరి ఆదాయం ఎంత, రాష్ట్ర ఆదాయ వనరులు ఏమిటి అనే అంశాలను దృష్టిలో ఉంచుకుంటారు. గిరిజన జనాభా, అటవీ ప్రాంతం, ఎడారి భూములు, జనసాంద్రత, వ్యవసాయానికి అననుకూల ప్రదేశం, అంతరాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వొచ్చు.

ప్రత్యేక హోదా వస్తే ఏం లాభం?

ఆర్టికల్ 371 ద్వారా, రాష్ట్రాలకు ప్రత్యేక నిబంధనలు చేయబడ్డాయి. తద్వారా స్థానిక ప్రజల హక్కులు రక్షించబడతాయి. ప్రత్యేక రాష్ట్ర హోదా పొందినప్పుడు, రాష్ట్రానికి ప్రత్యేక మినహాయింపులు అలాగే ప్రత్యేక గ్రాంట్లు లభిస్తాయి. దేశంలో ప్రణాళికా సంఘం ఉన్న సమయంలో, ఈ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ మొత్తం ప్రణాళిక వ్యయంలో దాదాపు 30 శాతం పొందేవి. ప్రత్యేక రాష్ట్రాలకు కూడా ఈ డబ్బు ఖర్చు చేసే స్వేచ్ఛ ఉండేది. కేంద్రం ఇచ్చిన మొత్తాన్ని ఒక ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా ఖర్చు చేయకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాడుకునే వెసులుబాటు కల్పిస్తుంది. సాధారణంగా ఒక ఆర్థిక సంవత్సరంలో విడుదలైన మొత్తం నిధులు ఖర్చు చేయకపోతే అవి లాప్స్ అవుతాయి. అదే ప్రత్యేక హోదా కల్గిన రాష్ట్రాలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. అంటే ప్రతి ఏటా డబ్బులు వాడుకోవచ్చు. కొత్త నిధులు కూడా తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

పన్ను మినహాయింపుతో పాటు అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ..

నిధులు మాత్రమే కాకుండా.. ప్రత్యేక రాష్ట్ర హోదా వచ్చిన తర్వాత అక్కడ అమలు చేస్తున్న కేంద్ర పథకాల్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం పెరుగుతుంది. రాష్ట్రంలోని పరిశ్రమలకు పన్ను మినహాయింపు లభిస్తుంది. పైగా పరిశ్రమలు నెలకొల్పాలంటే ప్రత్యేక రాయితీలు, అదనుగా గ్రాంట్లు అందిస్తుంది ప్రభుత్వం. ఇందులో ఎక్సైజ్, కస్టమ్ సుంకాలు కూడా ఉంటాయి. వాటిలో కూడా కొంత మినహాయింపు ఉంటుంది. పైగా పరిశ్రమలు నెలకొల్పిన వారికి అందించే రుణాల్లో 90శాతం గ్రాంట్ల రూపంలో, 10శాతం మాత్రమే రుణాల రూపంలో ఇస్తారు. ఆ రుణాలకు కూడా ఎలాంటి వడ్డీ వసూలు చేయరు. తద్వారా అక్కడ అభివృద్ధి వేగవంతం అవుతుంది. ఇప్పుడు టీడీపీ, జేడీయూలు ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌లకు ప్రత్యేక రాష్ట్ర హోదాపై పట్టుబట్టినట్లయితే, కేంద్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్‌లో వారికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించవచ్చు. ఈ ప్రత్యేక ప్యాకేజీ రూ.లక్ష కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. అయితే, ఈ మొత్తాన్ని ఏకమొత్తంలో కానీ ఏడాది పొడవునా వివిధ వాయిదాలలో విడుదల చేయవచ్చు. ప్యాకేజీ వల్ల అంత ప్రయోజనం ఉండదు. నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది.

దేశంలోని 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా..

ప్రస్తుతం దేశంలోని 11 రాష్ట్రాలు ప్రత్యేక రాష్ట్ర హోదా పొందాయి. వీటిలో ఆరు ఈశాన్య రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఆర్టికల్ 371(A)లో నాగాలాండ్‌కు ప్రత్యేక నిబంధన చేయబడింది, మత-సామాజిక సంప్రదాయాలు, సాంప్రదాయ చట్టం, నాగా చట్టాలకు అనుగుణంగా, సివిల్, క్రిమినల్ విషయాలు, హక్కులు, భూమి బదిలీకి సంబంధించిన నిర్ణయాలను భారత పార్లమెంటు తీసుకోవచ్చు. ఇవి మినహా ఇతర వనరులు ఏవీ కేంద్రానికి వర్తించవు. అయితే, ఈ చర్యను రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన తర్వాత మాత్రమే అమలు చేయవచ్చు. ప్రత్యేక నిబంధన ప్రకారం, నాగాలాండ్‌లోని భూమి, స్థానిక వనరులు ప్రభుత్వానికి చెందినవి కావు. కేవలం ప్రజలకు సంబంధించినవిగా పరిగణించబడతాయి. అదేవిధంగా ఆర్టికల్ 371 (జి) ప్రకారం మిజోరం ప్రత్యేక హోదాను పొందింది. మిజో ప్రజల చట్టపరమైన నిర్ణయాలు, వారి సంప్రదాయాలపై పార్లమెంటు చేసే ఏ చట్టమైనా, ఏ నిర్ణయమైనా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత మాత్రమే అమలు అవుతుంది. అదేవిధంగా, అస్సాంకు ఆర్టికల్ 371 (బి), మణిపూర్‌కు ఆర్టికల్ 371 (సి) ప్రత్యేక కేటాయింపులు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(F), సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లకు 371 (H) ప్రత్యేక హోదాను కల్పిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..