Watch Video: శునకానికి ఘనంగా దినకర్మ చేసిన యజమాని.. నివ్వెరపోయిన స్థానికులు!

| Edited By: Srilakshmi C

Aug 04, 2024 | 8:20 PM

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ కేంద్రంలోని సీతంపేట రోడ్‌లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి చేబోతుల రాజు జంతు ప్రేమికుడు. తన ఇంటి ఆవరణలో అహ్లాదకరంగా ఓ పార్కులా నిర్మించుకుని అందులో కుటీరం ఏర్పాటు చేశాడు. ఇందులో సుమారు 50 శునకాలకు ప్రతిరోజు ఆహారం పెడుతున్నాడు. అందులో టైసాన్ అనే ఓ సునకం గత 15 ఏళ్లుగా అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. అయితే టైసాన్..

Watch Video: శునకానికి ఘనంగా దినకర్మ చేసిన యజమాని.. నివ్వెరపోయిన స్థానికులు!
Dasa Dina Kharma Ritual To Pet Dog
Follow us on

శ్రీకాకుళం, ఆగస్టు 4: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ కేంద్రంలోని సీతంపేట రోడ్‌లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి చేబోతుల రాజు జంతు ప్రేమికుడు. తన ఇంటి ఆవరణలో అహ్లాదకరంగా ఓ పార్కులా నిర్మించుకుని అందులో కుటీరం ఏర్పాటు చేశాడు. ఇందులో సుమారు 50 శునకాలకు ప్రతిరోజు ఆహారం పెడుతున్నాడు. అందులో టైసాన్ అనే ఓ సునకం గత 15 ఏళ్లుగా అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. అయితే టైసాన్ ఇటీవల మరణించింది. తన శునకం మృతి చెందినప్పటి నుంచి రాజు నిద్రాహారాలు మానేసి ఎంతో వ్యధ అనుభవిస్తున్నాడు. తన బాధను ఇతరులకు చెప్పుకోలేక గుండెల్లోనే దాచుకుంటూ కుమిలిపోయాడు. తాజాగా చనిపోయిన శునకానికి దినకర్మ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం 9వ రోజు కావటంతో వందలాది శునకాలను తీసుకువచ్చి వాటికి ఆహారం ఇస్తూ, అలాగే బంధువులు, మిత్రులు సమీప గ్రామాల ప్రజలందరిని పిలిచి అదివారం వేద మంత్రాలతో శునకంకు ఖననం చేసిన చోట దినకర్మ చేశాడు. దీనిని చూసి ప్రతిఒక్కరూ ఔరా అని ముక్కున వేలేసుకున్నారు.

నేటి కాలంలో సొంత తల్లి దండ్రులకే పట్టెడు అన్నం పెట్టలేక అనాధాశ్రమాల్లో, వృద్దాశ్రమాలలో పెడుతున్నటువంటి రోజులలో.. ఇలా పెంపుడు కుక్కను ఇంట్లో కుటుంబ సభ్యుని మాదిరిగా భావించి కర్మ కాండలను నిర్వహించటం అంతటా చర్చనీయాంశం అయింది. కానీ తన తల్లికి ఇచ్చిన మాటను నమ్మి పది మందికి అన్నం పెట్టాలి. మనల్ని నమ్ముకున్న వారికి ఆహారం ఇవ్వాలి అనే మాటకు కట్టుబడి మూగ జీవాలైన సునకాల ఆకలి తీరుస్తున్నానని రాజు అంటున్నాడు.

ఇవి కూడా చదవండి

కరోనా కష్టకాలంలో ప్రజలకు ఆహారం లేని సమయంలో శునకాలు మృతి చెందడం చూసి చలించిన రాజు.. కరోనా సమయంలో వందలాది శునకాలకు తన ఇంట్లోనే ఆహారం వండి పాలకొండ పట్టణంలో వీధుల్లోకి వెళ్లి శునకాలకు అందించాడు. దీంతో అప్పట్లో పాలకొండ పట్టణ ప్రజలందరూ ఆర్మీ రాజు ఔదర్యాన్ని కొనియాడారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.