Andhra Pradesh: పండుగ పూటా అదే రచ్చ.. జీవో నెం 1 ప్రతులను కాల్చేసిన చంద్రబాబు.. కౌంటర్ ఇస్తున్న వైసీపీ..

|

Jan 14, 2023 | 1:02 PM

సంక్రాంతి పండుగపూట భోగి మంటల వేడి అటుంచితే.. రాజకీయ పార్టీల నేతల కామెంట్స్ మాత్రం ఓ రేంజ్‌లో హీట్ పెంచుతున్నాయి. భోగి వేడుకలు ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ వార్‌కు వేదికయ్యాయి.

Andhra Pradesh: పండుగ పూటా అదే రచ్చ.. జీవో నెం 1 ప్రతులను కాల్చేసిన చంద్రబాబు.. కౌంటర్ ఇస్తున్న వైసీపీ..
Nara Chandrababu Naidu
Follow us on

సంక్రాంతి పండుగపూట భోగి మంటల వేడి అటుంచితే.. రాజకీయ పార్టీల నేతల కామెంట్స్ మాత్రం ఓ రేంజ్‌లో హీట్ పెంచుతున్నాయి. భోగి వేడుకలు ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ వార్‌కు వేదికయ్యాయి. టీడీపీ-వైసీపీ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. భోగి మంటల్లో విపక్షాలు వేయాలని వైసీపీ అంటే, ధర్నాలు, ర్యాలీలకు నిషేధం విధిస్తూ జారీ చేసిన జీవోను భోగిమంటల్లో వేసేశారు టీడీపీ శ్రేణులు.

ఏపీ వ్యాప్తంగా భోగి వేడుకల్లో పొలిటికల్‌ పంచ్‌లు పేలుతున్నాయి. నారావారిపల్లిలో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు.. జగన్ సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ 1 ప్రతులను భోగిమంటల్లో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు. జగన్‌ నవ రత్నాల పేరుతో నవ మోసాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సైకో పాలన పోయి సైకిల్‌ పాలన రావాలి ప్రజలకు పిలుపునిచ్చారు బాబు. గుంటూరు ఘటన వైసిపి కుట్ర అని చంద్రబాబు ఆరోపించారు. ఇక టీడీపీ శ్రేణులు సైతం తమ అధినేతనే అనుకరించాయి. జీవో నంబర్‌ 1 కాపీలు దగ్ధం చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రామ్మోహన్, ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం దిగిపోవాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. పండుగ పూట కూడా ఆర్టీసీ అధిక ఛార్జీలతో బాదుడే బాదుడుతో సామాన్యుల నడ్డి విరిచారని ఆరోపించారు.

ఇక చంద్రబాబు వైఖరిపై వైసీపీ నేతలు మండిపడ్డారు. మామకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కేశారని మండిపడ్డారు. జీవో నంబర్‌ 1 ప్రజలకోసమే తెచ్చామని, చంద్రబాబు బుద్ధిని భోగీ మంటల్లో వేశారన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..