Nellore: ఇంత బలుపేంటి మిస్టర్ MPTC.. నువ్వు రాగానే వంగి సలాం చేయాలా..

అతనో MPTC. ఓ పెట్రోల్ పంప్ వర్కర్‌తో నేను ఎవరో తెలుసా అన్నాడు. నేను మహేశ్ రెడ్డి అని చెప్పాడు. మహేశ్ రెడ్డి ఎవరో నాకు తెలీదు సార్ అని ఆ వర్కర్ సమాధానమిచ్చాడు. అంతే రెచ్చిపోయారు ఇంక.

Nellore: ఇంత బలుపేంటి మిస్టర్ MPTC.. నువ్వు రాగానే వంగి సలాం చేయాలా..
Petrol Pump Staffers Thrashed
Follow us

|

Updated on: Jan 04, 2023 | 12:45 PM

నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ నేత దాష్టీకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉలవపాళ్ళ పెట్రోల్ బంక్ సిబ్బందిపై ఎంపీటీసీ మహేష్ నాయుడు దాడి చేసి.. దారుణంగా కొట్టారు. ఇంత ఘోరం జరిగినా ఇంత వరకూ అతన్ని అరెస్టు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

పెట్రోల్ కోసం ఎంపీటీసీ మహేష్ నాయుడు కారుతో వచ్చారు.. అయితే సర్వర్ పనిచేయటం లేదని పెట్రోల్ బంక్ వర్కర్ తేజ సమాధానమిచ్చారు. అంతలోనే రెచ్చిపోయిన వైసీపీ నేత.. నేనెవరో తెలీదా.. ఎలా సమాధానం ఇవ్వాలో చెప్పాలా… అంటూ అంటూ విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ తేజకు ప్రస్తుతం కావలి ఏరియా హస్పటల్‌లో చికిత్స అందుతోంది.

దాడికి సంబంధించిన విజువల్స్ అన్నీ సీసీ పుటేజ్‌లో రికార్డయ్యాయి. దీంతో వైసీపీ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదంటూ.. టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీద రవిచంద్ర.. మహేష్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం