Nellore: టిఫిన్ సెంటర్ లో పేలిన సిలిండర్లు.. భారీగా ఎగసిపడిన మంటలు.. ఉలిక్కిపడ్డ స్థానికులు..

|

Nov 26, 2022 | 7:23 AM

నెల్లూరు లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వావిళ్లలోని ఓ టిఫిన్​సెంటర్​లో గ్యాస్ సిలిండర్లు పేలాయి. భారీ శబ్దంతో సిలిండర్లు పేలడంతో ఒక్కసారిగా మంటలు దావానలంలా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో...

Nellore: టిఫిన్ సెంటర్ లో పేలిన సిలిండర్లు.. భారీగా ఎగసిపడిన మంటలు.. ఉలిక్కిపడ్డ స్థానికులు..
Fire Accident
Follow us on

నెల్లూరు లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వావిళ్లలోని ఓ టిఫిన్​సెంటర్​లో గ్యాస్ సిలిండర్లు పేలాయి. భారీ శబ్దంతో సిలిండర్లు పేలడంతో ఒక్కసారిగా మంటలు దావానలంలా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్ లో ఎంత మంది ఉన్నారనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు. మంటలు వ్యాపించడంతో దుకాణంలో ఎంతమంది ఉన్నారు.. వారి పరిస్థితి ఏమిటన్న దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అధికారులకు సమాచారం అదించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో మూడు సిలిండర్లు పేలి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

కాగా… గతంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. గ్యాస్​లీక్​అవుతోందనే విషయాన్ని గమనించకుండా వెలిగించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందగా.. వారి మూడో కుమార్తె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఉవ్వెత్తున ఎగిసిపడుతూ మంటలు ఇళ్లంతా వ్యాపించాయి. విషయం గుర్తించిన స్థానికులు వచ్చి తలుపులు తెరిచారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాద సమయంలో భార్యాభర్తలతో పాటు చిన్న కూతురు మాత్రమే ఇంట్లో ఉంది. మిగిలిన ఇద్దరూ బంధువుల ఇంటికి వెళ్లడంతో వారి ప్రాణాలు నిలిచాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..