AP News: హోటల్లో దోశ తింటుంటే పంటికి ఏదో తగిలింది.. ఏంటా అని చూడగా…
గుంటూరు కొరిటెపాడులోని ఓ హోటల్లో టిఫిన్ తిందామని ఓ వ్యక్తి ఫ్రెండ్స్తో కలిసి వెళ్లాడు. అయితే అక్కడ దోశ తింటుండగా పంటికి ఏదో తగిలింది.. తీసి చూసి కంగుతిన్నాడు. ఆ డీటేల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి....
తీసుకునే డబ్బులు తీసుకుంటూనే ఉన్నారు.. కానీ శుచి, శుభ్రత మాత్రం ఉండటం లేదు. మేం మాట్లాడుతుంది.. హెటల్స్, రెస్టారెంట్స్ గురించి అండీ. ఈ మధ్య ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తోన్న తనిఖీల్లో నాణ్యత లేని సరుకు వాడకం, శుభ్రత పాటించకపోవడం.. రిఫ్రిజిరేటర్స్లో ఫుడ్ పెట్టి.. దాన్ని మరో రోజు సర్వ్ చేయడం వంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇక ఫంగస్ పట్టిన వెజిటేబుల్స్, పురుగులు ఉన్న గూడ్స్ వంటివి కూడా కిచెన్స్లో కనిపించేసరికి జనాలు విస్తుపోయిన పరిస్థితి. తాజాగా గుంటూరులో ఓ హోటల్ నిర్లక్ష్య వైఖరి బయటపడింది. కొరిటెపాడులోని ఓ హోటల్కు టిఫిన్ చేయడానికి వెళ్లిన ఓ కస్టమర్కు వింత పరిణామం ఎదురైంది. అతను టిఫిన్ చేసేందుకు ఫ్రెండ్స్తో కలిసి వెళ్లాడు. వేడి వేడిగా దోశ ఇవ్వాలని కోరాడు. ఆర్డర్ ఇచ్చిన వెంటనే పొగలు కక్కుతూ దోశ వచ్చేసింది. ఆవురావురుమంటూ దోశను తింటున్న అతని పంటికి గట్టిగా ఏదో తగిలింది. ఏంటా అని బయటకు తీసి బిత్తరపోయాడు. దోశలో ఏకంగా ఇనుప బోల్ట్ కనిపించింది.
వెంటనే ఇదేం పని.. అంటూ హెటల్ యజమాని వద్దకు వెళ్లి ప్రశ్నించాడు. అతను పట్టించుకోలేదు. అసలు సమాధానం కూడా సరిగ్గా చెప్పలేదు. దీంతో కస్టమర్ వాగ్వాదానికి దిగాడు. వెంటనే ఆధారాలతో సహా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దోశలో బోల్ట్ వచ్చిన ఘటన తమ దృష్టికి వచ్చిందని జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ తెలిపారు. కొరిటెపాడులోని ఆ హోటల్లో ఫుడ్ను తనిఖీ చేసి.. ఒకవేళ రూల్స్ పాటించకుంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. దోశలోకి బోల్ట్ రావడం కలకలం రేపగా.. ఒకవేళ పొరపాటున ఆ కస్టమర్ బోల్ట్ను మింగేసి ఉంటే పరిస్థితి ఏంటని.. హోటల్పై మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..