AP Rains: భారీ వర్షాలపై హోం మంత్రి సమీక్ష.. అధికారులకు కీలక సూచనలు

|

Sep 01, 2024 | 2:53 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ముంపు బారిన పడిన 294 గ్రామలకు చెందిన 13,227 మందిని పునరావాస కేంద్రాలకు తరిలించినట్లు రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యలయంలోని స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఆదివారం ఆమె సమీక్ష నిర్వహించారు..

AP Rains: భారీ వర్షాలపై హోం మంత్రి సమీక్ష.. అధికారులకు కీలక సూచనలు
Home Minister Anitha
Follow us on

అమరావతి, సెప్టెంబర్ 1: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ముంపు బారిన పడిన 294 గ్రామలకు చెందిన 13,227 మందిని పునరావాస కేంద్రాలకు తరిలించినట్లు రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యలయంలోని స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఆదివారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ.. ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అధిక వర్షాల కారణంగా ఇంత వరకు 100 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 13,227 మందిని వాటిల్లోకి తరలించామన్నారు. ఆయా ప్రాంతాల్లో 61 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకూ 9 మంది మరణించారని అన్నారు. పోలిస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బెటాలియన్ల బృందాలు ముంపు ప్రాంతాల్లోని 600 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు.

9 ఎస్డీఆర్ఎఫ్, 8 ఎన్డీఆర్ఎఫ్‌తో సహా మొత్తం 17 బృందాలు.. 7 జిల్లాల్లోని 22 ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎటువంటి అత్యవసర పరిస్థితులనైన ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, 5 బోట్లు , 1 హెలికాఫ్టర్ సిద్ధంగా ఉంచామన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో అధిక వర్షాల కారణంగా ఏర్పడిన పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ మంత్రులు అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని నిర్దేశించారన్నారు. వర్షాలు పూర్తిగా తగ్గిన తరువాత పంటనష్టంపై ఎన్యూమురేషన్ చేపడతామన్నారు. ఇప్పటి వరకు అందిన ప్రాధమిక సమాచారం ప్రకారం 14 జిల్లాల్లోని 62,644 హెక్టార్లలో వరి పంట నీట మునిగిందని, 7218 హెక్టార్లలో ఉద్యాన వన పంటలు నీట మునిగిందని మంత్రి అన్నారు. రెవెన్యూ, పోలిస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య, విద్యుత్ వంటి పలు ప్రభుత్వ శాఖలన్ని సమన్వయంతో పనిచేసి, యుద్ద ప్రాతిపాదికన చర్యలు తీసుకోవడం వలన ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలినట్లు తెలిపారు.

భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోను కమాండ్ కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. నోడల్ అధికారులను నియమించి ఎప్పటికప్పుడూ పరిస్థితులను సమీక్షిస్తూ సహాయక చర్యలను చేపడుతున్నట్లు తెలిపారు. రాయనపాడు రైల్వే స్టేషన్లో వరద నీరు చేరినందున తమిళనాడు ఎక్సప్రెస్‌ను నిలుపుదల చేసినట్లు తెలిపారు. దీంతో ప్రయాణికులను వారి వారి గమ్య స్థానాలకు ఆర్టీసి బస్సుల ద్వారా తరలించేందు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేశామన్నారు. ప్రయాణికులకు ఆహారం, తాగు నీరు ఏర్పాటు చేశామన్నారు. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లి ప్రవహిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి వంగలపూడి అనిత అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.