ఏపీలో ఆ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్.. అప్పటి నుంచే అసెంబ్లీ సమావేశాలు.. పూర్తి వివరాలు..

|

Jun 18, 2024 | 2:46 PM

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 21 నుంచి రెండు రోజులపాటు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ముందుగా ప్రొటెం స్పీకర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 21న ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‎లో ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఘట్టం రానే వచ్చింది. అసెంబ్లీ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. సార్వత్రిక ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు మారిపోయాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలపై సీఎం చంద్రబాబు ఐదు సంతకాలు చేశారు.

ఏపీలో ఆ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్.. అప్పటి నుంచే అసెంబ్లీ సమావేశాలు.. పూర్తి వివరాలు..
Ap Assembly
Follow us on

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 21 నుంచి రెండు రోజులపాటు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ముందుగా ప్రొటెం స్పీకర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 21న ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‎లో ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఘట్టం రానే వచ్చింది. అసెంబ్లీ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. సార్వత్రిక ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు మారిపోయాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలపై సీఎం చంద్రబాబు ఐదు సంతకాలు చేశారు. అభివృద్దిని పరుగులు పెట్టిస్తానంటూ కార్యాచరణ సిద్దం చేసుకుంటున్నారు. ఈ తరుణంలో అసెంబ్లీ సమావేశాలు జరగడం హాట్ టాపిక్‎గా మారింది. ఏపీలో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారు రాష్ట్ర సచివాలయంలోని తమ ఛాంబర్లలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు శాసనసభలో ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా సెషన్స్ నిర్వహించనుంది ప్రభుత్వం. ముందుగా ప్రోటెం స్పీకర్.. గెలిచిన ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు.

ఆ తరువాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఇప్పుడున్న సీనియారిటీ ప్రకారం ప్రోటెం స్పీకర్‎గా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఎంపిక చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే స్పీకర్‎గా ఎవరిని ఎన్నుకుంటారు అన్న ఉత్కంఠ చాల మందిలో నెలకొన్నప్పటికీ అయ్యన్న పాత్రుడి పేరును ఖరారు చేసినట్లు సమాచారం. టీడీపీ తరఫున అయ్యన్న పాత్రునికి స్పీకర్‎గా అవకాశం ఇస్తే.. జనసేన తరఫున మండలి బుద్ద ప్రసాద్‎కు డిప్యూటీ స్పీకర్‎గా నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే డిప్యూటీ స్పీకర్‎గా బొలిశెట్టి శ్రీనివాస్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోందంటున్నారు పార్టీ నాయకులు. అయ్యన్న పాత్రుడి పేరు స్పష్టమైనప్పటికీ మండలి బుద్ద ప్రసాద్, బొలిశెట్టి శ్రీనివాస్ పేర్లు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఏది ఏమైనా ఏపీలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో అటు అధికార ఎన్డీయే కూటమి, ఇటు ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ఆర్సీపీ మధ్య సభలో మాటల యుద్దం హోరా హోరీగా, వాడీవేడిగా నడిచే అవకాశం ఉంటుందని చర్చించుకుంటున్నారు ప్రజలు.

రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

ఇదిలా ఉంటే ఏపీ శాశనమండలిలో ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదలైంది. శాశనమండలిలో ఇప్పటికే 2 ఎమ్మెల్సీ సీట్లు కాళీగా ఉన్న నేపథ్యంలో వాటి నియామకానికి చర్యలు చేపట్టారు అధికారులు. రామచంద్రయ్య, షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. వైసీపీ నుంచి టీడీపీలోకి పార్టీ మారడంతో రామచంద్రయ్యపై ఇటీవల అనర్హతవేటు వేశారు మండలి చైర్మన్. ఇదిలా ఉంటే వైసీపీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఇక్బాల్‌ స్థానంలో కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాలు ఖాళీ కావడంతో షెడ్యూల్‌ విడుదల చేసిన ఎన్నికల కమిషన్.

నోటిఫికేషన్ వివరాలు..

ఈనెల 25న ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌
జూలై 2 నుంచి నామినేషన్ల స్వీకరణ
జూలై 3న నామినేషన్ల పరిశీలన
జూలై 5 వరకు నామినేషన్‌ ఉపసంహరణకు గడువు
జూలై 12న ఉ. 9 నుంచి సా. 4వరకు పోలింగ్‌
జూలై 12న సాయంత్రం 5 కు ఫలితాలు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..