Andhra Pradesh: కాకినాడలో ఘోరం.. అలరించడానికి వెళుతూ.. అనంతలోకాలకు చేరిన కళాకారులు..

|

Nov 16, 2022 | 7:49 AM

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా మల్లేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరో 9మందికి తీవ్రగాయాలయ్యాయి.

Andhra Pradesh: కాకినాడలో ఘోరం.. అలరించడానికి వెళుతూ.. అనంతలోకాలకు చేరిన కళాకారులు..
Road Accident
Follow us on

Kakinada Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద ఆగి ఉన్న లారీని టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరో 9మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కొందరు తాడేపల్లి నుంచి విశాఖపట్నం వెళ్తుండగా బుధవారం తెల్లవారుజామున 3గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన వారంతా కళాకారులుగా గుర్తించారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

రాజమండ్రి నుంచి అనకాపల్లిలో అమ్మవారు వేషాలు వేయడానికి కళాకారుల బృందం.. టాటా మ్యాజిక్ వాహనంలో బయలుదేరింది. ప్రమాద సమయంలో టాటా మ్యాజిక్ వాహనంలో 13 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరంతా అనకాపల్లి పేరంటమ్మ తల్లి గుడి ఉత్సవాల్లో కసింకోట వేషాలు వేయడానికి వెళుతున్నారని.. ఈ సమయంలో మల్లేపల్లి దగ్గర టాటా మ్యాజిక్ వాహనం లారీని ఢీకొట్టిందని తెలిపారు.

మృతులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..