ఆరు నెలలుగా కరోనా రోగులకు సేవలందిస్తోన్న నటికి పాజిటివ్
దేశంలో కరోనా వచ్చినప్పటి నుంచి ఫ్రంట్లైన్ వారియర్ల సేవలు మరవలేనివి. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వారు సేవలు అందించారు, ఇప్పటికీ అందిస్తున్నారు
Shikha Malhotra corona: దేశంలో కరోనా వచ్చినప్పటి నుంచి ఫ్రంట్లైన్ వారియర్ల సేవలు మరవలేనివి. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వారు సేవలు అందించారు, ఇప్పటికీ అందిస్తున్నారు. వారి చేస్తున్న సేవకు రుణం తీర్చుకోలేనిది. ఇదిలా ఉంటే ఈ కరోనా వేళ రోగులకు సేవ చేసేందుకు పలువురు సినీ ప్రముఖులు తమ తమ వృత్తుల్లో(డాక్టర్లు, నర్సులు) చేరారు. వారిలో నటి సిఖా మల్హోత్రా కూడా ఒకరు. షారూక్ ఫ్యాన్ చిత్రంలో నటించిన సిఖా.. బీఎంసీ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఓ ఆసుపత్రిలో నర్సుగా వాలంటరీ సేవలు అందించారు. గత ఆరు నెలలుగా ఆమె ఆ ఆసుపత్రిలోనే పనిచేస్తున్నారు.
అయితే ఇటీవల ఆమెకు కరోనా సోకింది. ఈ విషయాన్ని సిఖా సోషల్ మీడియాలో వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని, తన శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గినట్లుగా అనిపిస్తుందని తెలిపారు. ఇక ఈ వైరస్పై అందరిలో అవగాహన పెరగాలని, కరోనాను సీరియస్గా తీసుకోవాలని, కుదిరినంత వరకు బయటకు రాకపోవడమే మంచిదని ఆమె సూచిస్తున్నారు. మరోవైపు ఆమె పోస్ట్కి స్పందించిన అభిమానులు మీరు త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Read More:
నిశ్శబ్దం.. అభిమానికి సారీ చెప్పిన మాధవన్
జక్కన్నపై ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఫిర్యాదు.. బాధ మొత్తం కక్కేసిన ఎన్టీఆర్, చెర్రీ