క్వారీ గుంతలో పడి ఇద్దరు యువకుల గల్లంతు

సెల్ఫీ మోజులో రెండు ప్రాణాలు ప్రమాదంలో చిక్కికున్నాయి. క్వారీ గుంట వద్ద సెల్ఫీ దిగుతూ ఇద్దరు యువకులు మిస్సయ్యారు. స్థానికుల సమాచారం మేరకు యువకుల కోసం గాలింపుచర్యలు చేపట్టారు పోలీసులు.

క్వారీ గుంతలో పడి ఇద్దరు యువకుల గల్లంతు
Follow us

|

Updated on: Sep 17, 2020 | 4:25 PM

హైదరాబాద్ శివారులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ మోజులో రెండు ప్రాణాలు ప్రమాదంలో చిక్కికున్నాయి. క్వారీ గుంత వద్ద సెల్ఫీ దిగుతూ ఇద్దరు యువకులు మిస్సయ్యారు. స్థానికుల సమాచారం మేరకు యువకుల కోసం గాలింపుచర్యలు చేపట్టారు పోలీసులు.

రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లికి చేందిన మల్లేష్ (24) జయకృష్ణ (25) గా నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో పని ముగించుకుని వెళ్తూ క్వారీ గుంత వద్ద పోటీలు దిగేందుకు యత్నించారు. దీంతో ఒక్కసారిగా ఇద్దరు జారిపడి క్వారీ గుంతలో పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రిస్క్యూ టీం సాయంతో యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.