కోవిడ్ రూల్స్ ఉల్లంఘించిన వారికి , ఐసోలేషన్ నిబంధనలు పాటించనివారికి జపాన్ ప్రభుత్వం కొత్త ‘శిక్షలు’ విధిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ఏ దేశంలోనూ లేని విధంగా ఉంటున్నాయి ఇవి. నిబంధనలను అతిక్రమించినవారి వివరాలను బయటపెట్టడం, వారిని ఘోరంగా అవమానించడం వంటివి ఈ రూల్స్ లో ఉన్నాయి. ఇటీవల విదేశాల నుంచి తిరిగి వచ్చిన ముగ్గురు జపనీయులపై ఇలాంటి చర్య తీసుకుంది. వీరు క్వారంటైన్ రూల్స్ ని అతిక్రమించారని పేర్కొంది. ఇలా ఎవరు ఉల్లంఘించినా సరే వారు రెండు వారాల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందే.. ఆ సమయంలో వారు లొకేషన్ ట్రాకింగ్ స్మార్ట్ ఫోన్ యాప్ ని వినియోగించాలని, తమ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేస్తుండాలని ప్రభుత్వం సూచించింది. ఇలాంటి వింత శిక్షలను విధించడం ఇదే మొదటిసారి.
ఈ కొత్త ఉత్తర్వులపై ట్విటర్ యూజర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏ దేశంలోనూ ఈ విధమైన రూల్స్ లేవని, ఇవి దారుణ నిబంధనలని పలువురు విమర్శించారు. జపాన్ లో నిన్న 8,393 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇవి గతావారంతో పోలిస్తే రెండింతలు ఎక్కువని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. టోక్యో నగరంలో కొత్తగా 20, 30 ఏళ్ళ వయస్సులవారు సైతం కోవిడ్ బారిన పడ్డారు. ఒలంపిక్స్ జరుగుతున్న సమయంలో ఈ కేసులు మరింత పెరుగుతున్నాయని జపాన్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.ఈ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మందకొడిగా సాగుతోంది. వ్యాక్సిన్ పై ఇంకా అనేక మందిలో అపోహలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి : మాల్దీవుల మాదిరి ఇప్పుడు మన ఇండియాలో కూడా..ఎక్కడ..?ఎప్పుడు ..?అనుకుంటున్నారా..?(వీడియో)Maldives in India video.