కెన్యాలోని స్కూల్ హాస్టల్‌లో అగ్నిప్రమాదం.. 17 మంది స్టూడెంట్స్ మృతి.. 13 మందికి తీవ్ర గాయాలు

|

Sep 06, 2024 | 8:14 PM

ఈ హాస్టల్‌లో 14 ఏళ్లలోపు పిల్లలు 150 మందికి పైగా విద్యార్థులు నివసిస్తున్నారు. పాఠశాల భవనాలు ప్రధానంగా చెక్కతో నిర్మించబడ్డాయి. దీని కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ఈ సంఘటనను "భయంకరమైనది" అని అభివర్ణించారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధ్యులకు తగిన శిక్ష విధిస్తామని చెప్పారు.

కెన్యాలోని స్కూల్ హాస్టల్‌లో అగ్నిప్రమాదం.. 17 మంది స్టూడెంట్స్ మృతి.. 13 మందికి తీవ్ర గాయాలు
Kenya School Fire
Follow us on

కెన్యాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పాఠశాల హాస్టల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది విద్యార్థులు మృతి చెందగా, 13 మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటన నైరీ కౌంటీలోని హిల్‌సైడ్ అందరాషా ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు తీవ్ర కాలిన గాయాలు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారులను హాస్టల్ నుంచి బయటకు తీసి సమీప ఆస్పత్రికి తరలించారు.

అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసు అధికార ప్రతినిధి రెసిలా ఒన్యాంగో తెలిపారు. ఈ హాస్టల్‌లో 14 ఏళ్లలోపు పిల్లలు 150 మందికి పైగా విద్యార్థులు నివసిస్తున్నారు. పాఠశాల భవనాలు ప్రధానంగా చెక్కతో నిర్మించబడ్డాయి. దీని కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ఈ సంఘటనను “భయంకరమైనది” అని అభివర్ణించారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధ్యులకు తగిన శిక్ష విధిస్తామని చెప్పారు.

ఘటనపై ఉపరాష్ట్రపతి ఏం చెప్పారు?

ఇవి కూడా చదవండి

కెన్యా వైస్ ప్రెసిడెంట్ రిగతి గచగువా రెసిడెన్షియల్ పాఠశాలల కోసం విద్యా మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసిన భద్రతా మార్గదర్శకాలను పాటించేలా చూడాలని పాఠశాల నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. ఈ భయానక ఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నాను అని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X ద్వారా తెలియజేశారు. బాధ్యులను తక్షణమే విధుల నుంచి తప్పించాలని సూచించారు.

ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి

కెన్యాలో హాస్టళ్లలో అగ్నిప్రమాదాలు సర్వసాధారణం. విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవలి నివేదిక ప్రకారం.. ఈ మంటలు తరచుగా మాదకద్రవ్యాల దుర్వినియోగం, అధిక రద్దీ కారణంగా సంభవిస్తున్నాయి హాస్టల్‌లో ఉండడం వల్ల పిల్లలకు చదువుకు ఎక్కువ సమయం లభిస్తుందని తల్లిదండ్రులు నమ్ముతున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా కెన్యాలోని పాఠశాలల్లో అగ్ని ప్రమాదాలు పెరిగాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ముప్పు వాటిల్లుతోంది. 2017లో నైరోబీలోని ఓ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది విద్యార్థులు చనిపోయారు. 2001లో మచాకోస్ కౌంటీలోని ఒక డార్మిటరీలో జరిగిన అగ్నిప్రమాదంలో 67 మంది విద్యార్థులు మరణించడంతో అత్యంత ఘోరమైన పాఠశాల అగ్ని ప్రమాదంగా నిలిచి పోయింది.

 

మరిని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..